ETV Bharat / city

కొత్త మోసానికి తెరలేపిన సైబర్‌ నేరగాళ్లు

author img

By

Published : May 21, 2020, 6:48 AM IST

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపుతున్నారు. కొవిడ్ -19 సమాచారాన్ని తెలుసుకోండి అంటూ సెల్​ఫోన్లకు సందేశాల రూపంలో లింక్​లు పంపుతూ ఖాతాలు లూటీ చేస్తున్నారు. పొరపాటున లింక్​ను క్లిక్​ చేస్తే..మీ బ్యాంకు ఖాతాలోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయిపోవచ్చు.

cyber  attacks
cyber attacks

‘కొవిడ్‌-19 సమాచారాన్ని తెలుసుకోండి’ అంటూ మీ సెల్‌ఫోన్లకు సందేశాల రూపంలో ఏవైనా లింకులు వస్తున్నాయా? వాటిపై ట్యాప్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పొరపాటున ముట్టుకుంటే బ్యాంకు ఖాతాలోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయిపోవచ్చు. సైబర్‌ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడ ఇది.

డబ్బులు కాజేస్తారిలా..
* కొవిడ్‌-19 పదజాలంతో సెల్‌ఫోన్‌కు సందేశాల రూపంలో లింక్‌ పంపిస్తారు. సమగ్ర సమాచారం కోసం ఆ లింక్‌పై ట్యాప్‌ చేయాలంటారు.
* దాన్ని ట్యాప్‌చేస్తే సెల్‌ఫోన్లోకి ఓ మోసపూరిత యాప్‌ (స్పైవేర్‌) వచ్చి పడుతుంది. దాంతో ఫోన్‌ వాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఫోన్‌ బ్యాంకింగ్‌ యాప్‌, లేదా బ్రౌజర్‌తో నెట్‌ బ్యాంకింగ్‌లో లాగిన్‌ అయితే యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ వివరాలు సైబర్‌ నేరగాళ్లకు చేరుతాయి. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలనూ ఈ స్పైవేర్‌ కాజేస్తుంది. దాంతో సైబర్‌ నేరగాళ్లు ఖాతాలు కొల్లగొడతారు.
* క్రెడిట్‌, డెబిట్‌ కార్డు నంబర్లు, వాటి సీవీవీ తదితర వివరాలను సెల్‌ఫోన్లలో సేవ్‌ చేస్తే ఆ వివరాలను సైబర్‌ నేరగాళ్లు కాజేసి.. డబ్బులు దోచుకుంటారు.

అపరిచిత లింకులు ముట్టుకోవద్దు..

కొవిడ్‌-19 సమాచారం పేరిట వచ్చే తెలియని లింక్‌లు ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దు. పొరపాటున ట్యాప్‌ చేసినా, దాన్ని ఇన్‌స్టాల్‌ చేయడానికి అనుమతించొద్దు. తెలియకుండా ఈ రెండూ చేస్తే వెంటనే మీ సెల్‌ఫోన్లో కాంటాక్ట్స్‌, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచుకుని.. ఫ్యాక్టరీ సెట్టింగ్‌లోకి వెళ్లి ఫోన్‌ను రీసెట్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే కొంతవరకూ సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా బయటపడొచ్చు. - - నల్లమోతు శ్రీధర్‌, సైబర్‌ భద్రత నిపుణుడు

ఇదీ చదవండి:

ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్ రిజర్వేషన్లు షురూ

‘కొవిడ్‌-19 సమాచారాన్ని తెలుసుకోండి’ అంటూ మీ సెల్‌ఫోన్లకు సందేశాల రూపంలో ఏవైనా లింకులు వస్తున్నాయా? వాటిపై ట్యాప్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పొరపాటున ముట్టుకుంటే బ్యాంకు ఖాతాలోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయిపోవచ్చు. సైబర్‌ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడ ఇది.

డబ్బులు కాజేస్తారిలా..
* కొవిడ్‌-19 పదజాలంతో సెల్‌ఫోన్‌కు సందేశాల రూపంలో లింక్‌ పంపిస్తారు. సమగ్ర సమాచారం కోసం ఆ లింక్‌పై ట్యాప్‌ చేయాలంటారు.
* దాన్ని ట్యాప్‌చేస్తే సెల్‌ఫోన్లోకి ఓ మోసపూరిత యాప్‌ (స్పైవేర్‌) వచ్చి పడుతుంది. దాంతో ఫోన్‌ వాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఫోన్‌ బ్యాంకింగ్‌ యాప్‌, లేదా బ్రౌజర్‌తో నెట్‌ బ్యాంకింగ్‌లో లాగిన్‌ అయితే యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ వివరాలు సైబర్‌ నేరగాళ్లకు చేరుతాయి. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలనూ ఈ స్పైవేర్‌ కాజేస్తుంది. దాంతో సైబర్‌ నేరగాళ్లు ఖాతాలు కొల్లగొడతారు.
* క్రెడిట్‌, డెబిట్‌ కార్డు నంబర్లు, వాటి సీవీవీ తదితర వివరాలను సెల్‌ఫోన్లలో సేవ్‌ చేస్తే ఆ వివరాలను సైబర్‌ నేరగాళ్లు కాజేసి.. డబ్బులు దోచుకుంటారు.

అపరిచిత లింకులు ముట్టుకోవద్దు..

కొవిడ్‌-19 సమాచారం పేరిట వచ్చే తెలియని లింక్‌లు ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దు. పొరపాటున ట్యాప్‌ చేసినా, దాన్ని ఇన్‌స్టాల్‌ చేయడానికి అనుమతించొద్దు. తెలియకుండా ఈ రెండూ చేస్తే వెంటనే మీ సెల్‌ఫోన్లో కాంటాక్ట్స్‌, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచుకుని.. ఫ్యాక్టరీ సెట్టింగ్‌లోకి వెళ్లి ఫోన్‌ను రీసెట్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే కొంతవరకూ సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా బయటపడొచ్చు. - - నల్లమోతు శ్రీధర్‌, సైబర్‌ భద్రత నిపుణుడు

ఇదీ చదవండి:

ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్ రిజర్వేషన్లు షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.