ETV Bharat / city

CS Press meet: ఐఆర్ జీతంలో భాగం కాదు: సమీర్ శర్మ

author img

By

Published : Jan 19, 2022, 7:19 PM IST

Updated : Jan 20, 2022, 4:20 AM IST

CS Press meet: కరోనా వేళ రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిన విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సీఎస్ సమీర్ శర్మ కోరారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలను, ఉద్యోగుల వేతనాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల కంటే ఉద్యోగులకు వీలైనంత ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మధ్యంతర భృతిని వేతనంలో భాగంగా చూడకూడదని... పీఆర్సీ ఆలస్యమైనప్పుడు ఇచ్చే ఉపశనం మాత్రమేనని స్పష్టంచేశారు.

సీఎస్ సమీర్ శర్మ
సీఎస్ సమీర్ శర్మ

CS Press meet: ‘పీఆర్సీ అమలులో జాప్యం అవుతుండటంతో మధ్యంతర భృతి ఇచ్చారు. దీనికింద రూ.17 వేల కోట్లు చెల్లించాం. ఇది జీతంలో భాగంకాదని అప్పట్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. రాష్ట్ర రాబడిపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది. అన్నింటిపై సీఎంతో చర్చించాకే ఉత్తర్వులు వెలువడ్డాయి. కరవు భత్యం తగ్గింపుతో ఎవరి స్థూల (గ్రాస్‌) జీతం తగ్గడంలేదు. పది రోజులు ఆగితే పే స్లిప్స్‌ వస్తాయి. గతనెల, ఈనెల ప్లే స్లిప్స్‌ పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివరించారు. బుధవారం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆయా వివరాలను వెల్లడించారు. సీఎస్‌ సమీర్‌శర్మ మాట్లాడుతూ.. ‘2008-09 పీఆర్సీ సమయంలో నేను ఆర్థిక కార్యదర్శిగా ఉన్నాను. అప్పటికి, ఇప్పటికి పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. రాష్ట్ర రాబడి ప్రస్తుతం రూ.62 వేల కోట్లు ఉంది. కొవిడ్‌ లేకపోతే అది రూ.98 వేల కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగానూ రాబడిపై ప్రభావం కనిపిస్తోంది. అయినా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. పీఆర్సీ అమలులో కొన్ని పెంపు, తగ్గింపులు సహజమే. కేంద్ర పీఆర్సీ అమలుతో మరింత మేలు కలుగుతుంది. త్వరలో ఒకే దేశం, ఒకే పీఆర్సీ అవుతుంది. 60 ఏళ్లలో కూడా ఉద్యోగులు పనిచేసేందుకు ఫిట్‌గా ఉన్నారు. వీరితో మరో రెండేళ్లు పనిచేయించేందుకే పదవీ విరమణ వయసు పెంచాం. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గవు. ఉద్యోగుల సూచనలు ఒక్కటీ పరిగణించలేదనేది నిజం కాదు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో పలుదఫాలు చర్చించి, అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సులపై చివరగా సీఎం నిర్ణయం తీసుకున్నాకే ఉత్తర్వులు ఇచ్చాం. ఏంజరిగినా కుటుంబ పెద్దమీదే నిందలు వస్తాయి. ఇవి ఊహించినవే. ఉద్యోగ సంఘాలతో సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు సమ్మెకు వెళ్తామన్నారనేది తెలియదు. లిఖిత పూర్వంగా ఎవరూ ఇవ్వలేదు’ అని తెలిపారు.

పీఆర్సీతో న్యాయం జరిగింది: రావత్‌
‘పీఆర్సీతో ఉద్యోగులు, పింఛన్‌దార్లకు న్యాయం జరిగిందని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
* 2021-22 ప్రకారం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,70,215 ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు అన్నింటికంటే తక్కువ. రెవెన్యూ లోటు రూ.34,927 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,370 కోట్లు ఉంది.
* పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఏటా సగటున 15% పెరగాలి. ఈ లెక్కన 2019-20లో రూ.71,844 కోట్లకుగాను రూ.60,933 కోట్లు, 2020-21లో రూ.82,620 కోట్లుకుగాను రూ.60,688 కోట్లే రాబడి వచ్చింది.
* ఈ ప్రభుత్వం వచ్చిన నెలకే ఉద్యోగులు, పింఛనర్లకు మధ్యంతర భృతి ఇవ్వడం ద్వారా రూ.17,918 కోట్లు చెల్లించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, యానిమేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పర్యవేక్షకులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సామాజిక ఆరోగ్య కార్యకర్తల గౌరవ వేతనం పెంపు, హోంగార్డుల రోజువారీ డ్యూటీ అలవెన్స్‌ పెంపు అమలు చేశారు.
* కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాల అమలు, ఆర్టీసీ విలీనం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, వైద్య రంగంలో నియామకాలు, ఆప్కాస్‌ ద్వారా ఆయా ఉద్యోగులకు మేలు కల్పించారని రావత్‌ వివరించారు.

జీతం పెరుగుతుంది: శశిభూషణ్‌కుమార్‌
ఫిట్‌మెంట్‌ 14.29% పెంచాలని కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేస్తే, ప్రభుత్వం 23% ప్రకటించిందని జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ...
* ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగులకు ఏటా రూ.60,177 కోట్లు వెచ్చిస్తుంటే, 23% ఫిట్‌మెంట్‌ రూపంలో అదనంగా రూ.10,247 కోట్లు ఖర్చువుతుంది.
* నెలకు రూ.53,950 బేసిక్‌ ఉన్న ఓ ఉద్యోగికి హెచ్‌ఆర్‌ఏ 12 నుంచి 8 శాతానికి తగ్గడంతో... గత నెలలో పాత పీఆర్సీ ప్రకారం మధ్యంతర భృతితో కలిపి స్థూల జీతం రూ.93,083 ఉంటే, కొత్త పీఆర్సీ ప్రకారం ఈ నెలలో రూ.1,06,257కి పెరుగుతుంది.
* అఖిలభారత అధికారుల హెచ్‌ఆర్‌ఏ రూ.40 వేల స్లాబ్‌ తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* పదవీ విరమణ వయసు రెండేళ్లకు పెంపు ద్వారా నెలకు రూ.లక్ష జీతమున్న ఉద్యోగికి రెండేళ్లలో రూ.24 లక్షలు వస్తుంది. పింఛన్‌ కింద నెలకు రూ.40 వేలు చొప్పున రెండేళ్లలో రూ.9.60 లక్షలు తీసేసినా, రూ.14.40 లక్షలు మేర సగటున ఉద్యోగికి ప్రయోజనం కలుగుతుంది. అదనంగా నాలుగు డీఏలు, రెండు ఇంక్రిమెంట్లు కూడా కలుస్తాయి.
* జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లేఅవుట్లలో ఉద్యోగులకు 10% కేటాయించి, 20% రిబేట్‌ ఇవ్వడం ద్వారా ఒకొక్కరికి రూ.5-7 లక్షల మేర మేలు కలుగుతుంది.
* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌ నెలాఖరుకు ప్రొబేషన్‌ ఖరారు కానుంది. జులై నుంచి వీరికి కొత్త పేస్కేల్‌ వర్తిస్తుంది.
* ఉద్యోగుల పీఎఫ్‌, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలు ఏప్రిల్‌ నాటికి చెల్లించనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సవరించిన కనీస వేతనాలు ఈనెల నుంచే వర్తిస్తాయి.
* కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబీకుల్లో ఇంకా కారుణ్య నియామకాలు మిగిలి ఉంటే, వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో జూన్‌ నెలాఖరుకు నియమించనున్నారు.

ఇదీ చదవండి: చమురు మంటకు తోడు కొవిడ్ దెబ్బ- సెన్సెక్స్ 656 డౌన్

CS Press meet: ‘పీఆర్సీ అమలులో జాప్యం అవుతుండటంతో మధ్యంతర భృతి ఇచ్చారు. దీనికింద రూ.17 వేల కోట్లు చెల్లించాం. ఇది జీతంలో భాగంకాదని అప్పట్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. రాష్ట్ర రాబడిపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది. అన్నింటిపై సీఎంతో చర్చించాకే ఉత్తర్వులు వెలువడ్డాయి. కరవు భత్యం తగ్గింపుతో ఎవరి స్థూల (గ్రాస్‌) జీతం తగ్గడంలేదు. పది రోజులు ఆగితే పే స్లిప్స్‌ వస్తాయి. గతనెల, ఈనెల ప్లే స్లిప్స్‌ పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివరించారు. బుధవారం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆయా వివరాలను వెల్లడించారు. సీఎస్‌ సమీర్‌శర్మ మాట్లాడుతూ.. ‘2008-09 పీఆర్సీ సమయంలో నేను ఆర్థిక కార్యదర్శిగా ఉన్నాను. అప్పటికి, ఇప్పటికి పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. రాష్ట్ర రాబడి ప్రస్తుతం రూ.62 వేల కోట్లు ఉంది. కొవిడ్‌ లేకపోతే అది రూ.98 వేల కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగానూ రాబడిపై ప్రభావం కనిపిస్తోంది. అయినా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. పీఆర్సీ అమలులో కొన్ని పెంపు, తగ్గింపులు సహజమే. కేంద్ర పీఆర్సీ అమలుతో మరింత మేలు కలుగుతుంది. త్వరలో ఒకే దేశం, ఒకే పీఆర్సీ అవుతుంది. 60 ఏళ్లలో కూడా ఉద్యోగులు పనిచేసేందుకు ఫిట్‌గా ఉన్నారు. వీరితో మరో రెండేళ్లు పనిచేయించేందుకే పదవీ విరమణ వయసు పెంచాం. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గవు. ఉద్యోగుల సూచనలు ఒక్కటీ పరిగణించలేదనేది నిజం కాదు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో పలుదఫాలు చర్చించి, అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సులపై చివరగా సీఎం నిర్ణయం తీసుకున్నాకే ఉత్తర్వులు ఇచ్చాం. ఏంజరిగినా కుటుంబ పెద్దమీదే నిందలు వస్తాయి. ఇవి ఊహించినవే. ఉద్యోగ సంఘాలతో సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు సమ్మెకు వెళ్తామన్నారనేది తెలియదు. లిఖిత పూర్వంగా ఎవరూ ఇవ్వలేదు’ అని తెలిపారు.

పీఆర్సీతో న్యాయం జరిగింది: రావత్‌
‘పీఆర్సీతో ఉద్యోగులు, పింఛన్‌దార్లకు న్యాయం జరిగిందని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
* 2021-22 ప్రకారం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,70,215 ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు అన్నింటికంటే తక్కువ. రెవెన్యూ లోటు రూ.34,927 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,370 కోట్లు ఉంది.
* పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఏటా సగటున 15% పెరగాలి. ఈ లెక్కన 2019-20లో రూ.71,844 కోట్లకుగాను రూ.60,933 కోట్లు, 2020-21లో రూ.82,620 కోట్లుకుగాను రూ.60,688 కోట్లే రాబడి వచ్చింది.
* ఈ ప్రభుత్వం వచ్చిన నెలకే ఉద్యోగులు, పింఛనర్లకు మధ్యంతర భృతి ఇవ్వడం ద్వారా రూ.17,918 కోట్లు చెల్లించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, యానిమేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పర్యవేక్షకులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సామాజిక ఆరోగ్య కార్యకర్తల గౌరవ వేతనం పెంపు, హోంగార్డుల రోజువారీ డ్యూటీ అలవెన్స్‌ పెంపు అమలు చేశారు.
* కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాల అమలు, ఆర్టీసీ విలీనం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, వైద్య రంగంలో నియామకాలు, ఆప్కాస్‌ ద్వారా ఆయా ఉద్యోగులకు మేలు కల్పించారని రావత్‌ వివరించారు.

జీతం పెరుగుతుంది: శశిభూషణ్‌కుమార్‌
ఫిట్‌మెంట్‌ 14.29% పెంచాలని కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేస్తే, ప్రభుత్వం 23% ప్రకటించిందని జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ...
* ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగులకు ఏటా రూ.60,177 కోట్లు వెచ్చిస్తుంటే, 23% ఫిట్‌మెంట్‌ రూపంలో అదనంగా రూ.10,247 కోట్లు ఖర్చువుతుంది.
* నెలకు రూ.53,950 బేసిక్‌ ఉన్న ఓ ఉద్యోగికి హెచ్‌ఆర్‌ఏ 12 నుంచి 8 శాతానికి తగ్గడంతో... గత నెలలో పాత పీఆర్సీ ప్రకారం మధ్యంతర భృతితో కలిపి స్థూల జీతం రూ.93,083 ఉంటే, కొత్త పీఆర్సీ ప్రకారం ఈ నెలలో రూ.1,06,257కి పెరుగుతుంది.
* అఖిలభారత అధికారుల హెచ్‌ఆర్‌ఏ రూ.40 వేల స్లాబ్‌ తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* పదవీ విరమణ వయసు రెండేళ్లకు పెంపు ద్వారా నెలకు రూ.లక్ష జీతమున్న ఉద్యోగికి రెండేళ్లలో రూ.24 లక్షలు వస్తుంది. పింఛన్‌ కింద నెలకు రూ.40 వేలు చొప్పున రెండేళ్లలో రూ.9.60 లక్షలు తీసేసినా, రూ.14.40 లక్షలు మేర సగటున ఉద్యోగికి ప్రయోజనం కలుగుతుంది. అదనంగా నాలుగు డీఏలు, రెండు ఇంక్రిమెంట్లు కూడా కలుస్తాయి.
* జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లేఅవుట్లలో ఉద్యోగులకు 10% కేటాయించి, 20% రిబేట్‌ ఇవ్వడం ద్వారా ఒకొక్కరికి రూ.5-7 లక్షల మేర మేలు కలుగుతుంది.
* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌ నెలాఖరుకు ప్రొబేషన్‌ ఖరారు కానుంది. జులై నుంచి వీరికి కొత్త పేస్కేల్‌ వర్తిస్తుంది.
* ఉద్యోగుల పీఎఫ్‌, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలు ఏప్రిల్‌ నాటికి చెల్లించనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సవరించిన కనీస వేతనాలు ఈనెల నుంచే వర్తిస్తాయి.
* కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబీకుల్లో ఇంకా కారుణ్య నియామకాలు మిగిలి ఉంటే, వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో జూన్‌ నెలాఖరుకు నియమించనున్నారు.

ఇదీ చదవండి: చమురు మంటకు తోడు కొవిడ్ దెబ్బ- సెన్సెక్స్ 656 డౌన్

Last Updated : Jan 20, 2022, 4:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.