ETV Bharat / city

CS files affidavit in HC: అమరావతి రాజధాని తీర్పుపై హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సీఎస్‌

author img

By

Published : Apr 2, 2022, 10:14 AM IST

Updated : Apr 2, 2022, 11:28 AM IST

CS sameer sharma files affidavit in HC
అమరావతి రాజధాని తీర్పుపై హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సీఎస్‌

10:10 April 02

గడువు ముగుస్తుండటంతో అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వం అఫిడవిట్‌లో ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు: ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్

CS files affidavit in HC: అమరావతి రాజధాని తీర్పుపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 190 పేజీల అఫిడవిట్​ను ధర్మాసనానికి సమర్పించారు. హైకోర్టు గత నెల 3న.. రాజధాని కేసులో తీర్పునిచ్చింది. నెల రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈనెల 3 లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. గడువు ముగుస్తున్నందున అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సీఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో నాలుగేళ్లు పొడిగించామని నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో.. 2024 జనవరి వరకు సమయం ఉందని.. హైకోర్టుకు తెలిపింది.

అఫిడవిట్‌లో స్పష్టంగా చెప్పలేదు.. అమరావతి అభివృద్ధిని ఇంకా జాప్యం చేసేందుకు.. ప్రభుత్వం అఫిడవిట్‌లో ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదని.. ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పినా.. వారి వ్యాజ్యం వీగిపోతుందన్న విషయం ప్రభుత్వానికీ తెలుసన్నారు.

ఇదీ చదవండి:

ఇళ్లు నిర్మించే స్తోమత లేదని'... చేతులెత్తేస్తున్న లబ్ధిదారులు

10:10 April 02

గడువు ముగుస్తుండటంతో అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వం అఫిడవిట్‌లో ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు: ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్

CS files affidavit in HC: అమరావతి రాజధాని తీర్పుపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 190 పేజీల అఫిడవిట్​ను ధర్మాసనానికి సమర్పించారు. హైకోర్టు గత నెల 3న.. రాజధాని కేసులో తీర్పునిచ్చింది. నెల రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈనెల 3 లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. గడువు ముగుస్తున్నందున అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సీఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో నాలుగేళ్లు పొడిగించామని నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో.. 2024 జనవరి వరకు సమయం ఉందని.. హైకోర్టుకు తెలిపింది.

అఫిడవిట్‌లో స్పష్టంగా చెప్పలేదు.. అమరావతి అభివృద్ధిని ఇంకా జాప్యం చేసేందుకు.. ప్రభుత్వం అఫిడవిట్‌లో ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదని.. ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పినా.. వారి వ్యాజ్యం వీగిపోతుందన్న విషయం ప్రభుత్వానికీ తెలుసన్నారు.

ఇదీ చదవండి:

ఇళ్లు నిర్మించే స్తోమత లేదని'... చేతులెత్తేస్తున్న లబ్ధిదారులు

Last Updated : Apr 2, 2022, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.