ETV Bharat / city

ముఖ్యమంత్రి జగన్​కు కరోనా పరీక్షలు

author img

By

Published : Apr 17, 2020, 7:06 PM IST

ముఖ్యమంత్రి జగన్‌కు వైద్యులు కోవిడ్-19 పరీక్ష నిర్వహించారు. ఫలితాల్లో నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ రాష్ట్రానికి లక్ష ర్యాపిడ్​ టెస్టు కిట్లు వచ్చాయి. వాటి పరిశీలనలో భాగంగా సీఎం జగన్​ తొలిసారిగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు.

cm jagan
cm jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు వైద్యులు కోవిడ్‌ –19 పరీక్ష చేశారు. రాష్ట్ర స్థాయి కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు సీఎం జగన్ చేతి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్ష చేశారు. దక్షిణ కొరియా నుంచి రాష్ట్రానికి ఇవాళ లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ కిట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఈ కిట్లతోనే సీఎం జగన్​కు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షలో సీఎం జగన్​కు కరోనా వైరస్ లేనట్లుగా ఫలితం వచ్చింది. ర్యాపిడ్​ టెస్టు కిట్ ద్వారా కేవలం పది నిముషాల్లోనే ఫలితం వచ్చిందని సీఎంవో కార్యాలయం తెలిపింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు వైద్యులు కోవిడ్‌ –19 పరీక్ష చేశారు. రాష్ట్ర స్థాయి కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు సీఎం జగన్ చేతి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్ష చేశారు. దక్షిణ కొరియా నుంచి రాష్ట్రానికి ఇవాళ లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ కిట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఈ కిట్లతోనే సీఎం జగన్​కు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షలో సీఎం జగన్​కు కరోనా వైరస్ లేనట్లుగా ఫలితం వచ్చింది. ర్యాపిడ్​ టెస్టు కిట్ ద్వారా కేవలం పది నిముషాల్లోనే ఫలితం వచ్చిందని సీఎంవో కార్యాలయం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.