ETV Bharat / city

ఆహారశుద్ధి పరిశ్రమ హాహాకారం - ఆహారశుద్ధిపై కరోనా ప్రభావం న్యూస్

ఆహారశుద్ధి పరిశ్రమలపై లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. కార్మికులు హాజరుకాకపోవడం, రవాణా నిలిచిపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. గుజ్జు తయారీ నిలిచిపోవడంతో టమాటా ధర పతనమైంది. చిత్తూరు, కడప జిల్లాల్లో 30 ఆహారశుద్ధి పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 18 వరకు టమాటా గుజ్జు తయారు చేస్తాయి. ఒక్కో దానికి రోజుకు 150 టన్నుల వరకు టమాటా అవసరం. కొన్నాళ్లుగా వీటిలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

corona effect on Food purification industry
corona effect on Food purification industry
author img

By

Published : Apr 12, 2020, 11:09 AM IST

పరిశ్రమల మూసివేతకు కారణాలెన్నో:

కూలీలు పనికి రాకపోవడం, ఏదైనా ఇబ్బంది ఎదురైతే తమను బాధ్యులుగా చేస్తారేమోనన్న భయం యాజమాన్యాల్లో ఉండటం... కొందరు డ్రైవర్లు వాహనాలు తీయకపోవడం, ప్యాకింగ్‌కు అవసరమయ్యే ముడి సామగ్రి లభించకపోవడం టమాటా గుజ్జు పరిశ్రమలు పని చేయడం లేదు.

సహాయ కేంద్రాలు సత్వరం స్పందిస్తేనే:

వాహనాలను ఎక్కడైనా పోలీసులు ఆపినప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సహాయ కేంద్రాలకు ఫోన్‌ చేసినా.. సరైన స్పందన కానరావడం లేదని కొన్ని యూనిట్ల యజమానులు వివరించారు. వాహనం నిలిపేశారని సమాచారం ఇచ్చిన వెంటనే వారు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా రక్కసి అంతానికి ఆయుర్వేద బ్రహ్మాస్త్రం!

పరిశ్రమల మూసివేతకు కారణాలెన్నో:

కూలీలు పనికి రాకపోవడం, ఏదైనా ఇబ్బంది ఎదురైతే తమను బాధ్యులుగా చేస్తారేమోనన్న భయం యాజమాన్యాల్లో ఉండటం... కొందరు డ్రైవర్లు వాహనాలు తీయకపోవడం, ప్యాకింగ్‌కు అవసరమయ్యే ముడి సామగ్రి లభించకపోవడం టమాటా గుజ్జు పరిశ్రమలు పని చేయడం లేదు.

సహాయ కేంద్రాలు సత్వరం స్పందిస్తేనే:

వాహనాలను ఎక్కడైనా పోలీసులు ఆపినప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సహాయ కేంద్రాలకు ఫోన్‌ చేసినా.. సరైన స్పందన కానరావడం లేదని కొన్ని యూనిట్ల యజమానులు వివరించారు. వాహనం నిలిపేశారని సమాచారం ఇచ్చిన వెంటనే వారు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా రక్కసి అంతానికి ఆయుర్వేద బ్రహ్మాస్త్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.