ETV Bharat / city

రాష్ట్రంలో మరో 993 మందికి కొవిడ్​ పాజిటివ్.. ముగ్గురి మరణం

author img

By

Published : Mar 30, 2021, 7:31 PM IST

Updated : Mar 30, 2021, 9:11 PM IST

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 993 మందికి కరోనా సోకినట్టు నిర్ధరణ అయ్యింది. 480 మంది కోలుకోగా.. ముగ్గురు మరణించారు. మొత్తంగా.. 6,614 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో మరో 993 మందికి కొవిడ్​ పాజిటివ్
రాష్ట్రంలో మరో 993 మందికి కొవిడ్​ పాజిటివ్

రాష్ట్రం‌లో కరోనా కేసుల సంఖ్య తొమ్మిది లక్షల మార్క్‌ దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల సంఖ్య 1.50 కోట్లు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,851 పరీక్షలు నిర్వహించగా.. 993 కేసులు నిర్ధరణ అయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 198, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,00,805 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

గడచిన ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ వల్ల గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,213కి చేరింది. 24 గంటల వ్యవధిలో 480 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,86,978కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,50,52,215 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

రాష్ట్రం‌లో కరోనా కేసుల సంఖ్య తొమ్మిది లక్షల మార్క్‌ దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల సంఖ్య 1.50 కోట్లు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,851 పరీక్షలు నిర్వహించగా.. 993 కేసులు నిర్ధరణ అయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 198, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,00,805 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

గడచిన ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ వల్ల గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,213కి చేరింది. 24 గంటల వ్యవధిలో 480 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,86,978కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,50,52,215 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ఇదీ చదవండి:

'రోజుకు 45 వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం'

Last Updated : Mar 30, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.