ETV Bharat / city

జేఈఈ, నీట్‌ సిలబస్‌పై విద్యార్థుల్లో ఆందోళన

author img

By

Published : Dec 4, 2020, 8:56 AM IST

జేఈఈ మెయిన్స్, నీట్‌ సిలబస్‌పై.... విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది సిలబస్‌ను తగ్గిస్తారా... యాథావిధిగా ఉంచుతారా అనే అంశంపై... సందిగ్ధత కొనసాగుతోంది. ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ తగ్గించినందువల్ల... పోటీ పరీక్షల్లోనూ అలా చేయకుంటే.... విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Concern among students on JEE, NEET Syllabus
జేఈఈ, నీట్‌ సిలబస్‌పై విద్యార్థుల్లో ఆందోళన
జేఈఈ, నీట్‌ సిలబస్‌పై విద్యార్థుల్లో ఆందోళన

పోటీ పరీక్షల పాఠ్య ప్రణాళికపై.... విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. కరోనా వల్ల... రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ సిలబస్‌ను 30 శాతం తగ్గించింది. అయితే జేఈఈ మెయిన్స్, నీట్‌ సిలబస్‌ తగ్గింపుపై... జాతీయ పరీక్షల మండలి-ఎన్టీఏ ఆసక్తి చూపడం లేదు. పాఠ్య ప్రణాళికను చాలా రాష్ట్రాలు తగ్గించలేదన్న కారణంగా... దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించాలని ఎన్టీఏ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ, బోర్డు పరీక్షల అంశంపై..... కేంద్ర మానవ వనరుల శాఖ ఈనెల 10న వెబినార్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు, సందేహాలు స్వీకరించగా... భారీ స్పందన వచ్చినట్లు ప్రకటించింది.

వాస్తవానికి ఈనెల 3న వెబినార్‌ నిర్వహించాల్సి ఉండగా... విద్యార్థులు, విద్యావేత్తలు, అధ్యాపకుల నుంచి వస్తున్న స్పందనతో పొడిగించారు. ఈ నేపథ్యంలో... జేఈఈ, నీట్‌ సిలబస్‌పై కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయంపై విద్యార్థులు ఆసక్తితో ఉన్నారు. జూన్‌లో తెరుచుకోవాల్సిన విద్యాసంస్థలు... కరోనా వల్ల నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. చాలావరకూ ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించారు. కళాశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల......సీబీఎస్​సీ,ఐసీఎస్​ఈ వంటి బోర్డులు 30 శాతం సిలబస్‌ తగ్గించాయి.

ఏపీ ఇంటర్‌ విద్యామండలి సైతం దీన్నే అనుసరిస్తూ సిలబస్‌ తగ్గించింది. జేఈఈ, నీట్‌ పరీక్షల్లోనూ ఇలా చేయకుంటే విద్యార్థులు ఇబ్బంది పడతారని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్‌లో తొలగించిన సిలబస్‌ నుంచి...ఈ ఏడాది జేఈఈ, నీట్‌లో ప్రశ్నలు రాకుండా ప్రభుత్వం చూడగలిగితే విద్యార్థులకు మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

వేర్వేరు ఘటనల్లో... తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెలు

జేఈఈ, నీట్‌ సిలబస్‌పై విద్యార్థుల్లో ఆందోళన

పోటీ పరీక్షల పాఠ్య ప్రణాళికపై.... విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. కరోనా వల్ల... రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ సిలబస్‌ను 30 శాతం తగ్గించింది. అయితే జేఈఈ మెయిన్స్, నీట్‌ సిలబస్‌ తగ్గింపుపై... జాతీయ పరీక్షల మండలి-ఎన్టీఏ ఆసక్తి చూపడం లేదు. పాఠ్య ప్రణాళికను చాలా రాష్ట్రాలు తగ్గించలేదన్న కారణంగా... దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించాలని ఎన్టీఏ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ, బోర్డు పరీక్షల అంశంపై..... కేంద్ర మానవ వనరుల శాఖ ఈనెల 10న వెబినార్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు, సందేహాలు స్వీకరించగా... భారీ స్పందన వచ్చినట్లు ప్రకటించింది.

వాస్తవానికి ఈనెల 3న వెబినార్‌ నిర్వహించాల్సి ఉండగా... విద్యార్థులు, విద్యావేత్తలు, అధ్యాపకుల నుంచి వస్తున్న స్పందనతో పొడిగించారు. ఈ నేపథ్యంలో... జేఈఈ, నీట్‌ సిలబస్‌పై కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయంపై విద్యార్థులు ఆసక్తితో ఉన్నారు. జూన్‌లో తెరుచుకోవాల్సిన విద్యాసంస్థలు... కరోనా వల్ల నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. చాలావరకూ ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించారు. కళాశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల......సీబీఎస్​సీ,ఐసీఎస్​ఈ వంటి బోర్డులు 30 శాతం సిలబస్‌ తగ్గించాయి.

ఏపీ ఇంటర్‌ విద్యామండలి సైతం దీన్నే అనుసరిస్తూ సిలబస్‌ తగ్గించింది. జేఈఈ, నీట్‌ పరీక్షల్లోనూ ఇలా చేయకుంటే విద్యార్థులు ఇబ్బంది పడతారని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్‌లో తొలగించిన సిలబస్‌ నుంచి...ఈ ఏడాది జేఈఈ, నీట్‌లో ప్రశ్నలు రాకుండా ప్రభుత్వం చూడగలిగితే విద్యార్థులకు మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

వేర్వేరు ఘటనల్లో... తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.