ETV Bharat / city

ఇవాళ హస్తినకు సీఎం జగన్​.. అమిత్​షాతో భేటీ

author img

By

Published : Jun 1, 2020, 12:27 PM IST

Updated : Jun 2, 2020, 12:04 AM IST

cm-jagan
cm-jagan

07:53 June 01

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  భేటీ కానున్నారు. కరోనా లాక్​డౌన్ పరిస్థితుల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్తున్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవాల్సిందిగా సీఎం... కేంద్ర మంత్రిని కోరనున్నట్టు సమాచారం.

ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానికి సవివరంగా రెండు లేఖలను సీఎం రాశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునే అంశంతోపాటు ఇతర నిర్ణయాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి అమిత్ షాతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కౌన్సిల్ రద్దు అంశంతో పాటు ఎస్ఈసీ వ్యవహారం కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. హోం మంత్రితో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి బేటీ కానున్నట్టు తెలుస్తోంది. దిల్లీ పర్యటన అనంతరం సీఎం బుధవారం రాష్ట్రానికి తిరిగి వస్తారు. 

ఇదీ చదవండి:

ప్రధాని మోదీ చెబితే జగన్‌ వింటారేమో..!: జేసీ

07:53 June 01

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  భేటీ కానున్నారు. కరోనా లాక్​డౌన్ పరిస్థితుల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్తున్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవాల్సిందిగా సీఎం... కేంద్ర మంత్రిని కోరనున్నట్టు సమాచారం.

ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానికి సవివరంగా రెండు లేఖలను సీఎం రాశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునే అంశంతోపాటు ఇతర నిర్ణయాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి అమిత్ షాతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కౌన్సిల్ రద్దు అంశంతో పాటు ఎస్ఈసీ వ్యవహారం కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. హోం మంత్రితో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి బేటీ కానున్నట్టు తెలుస్తోంది. దిల్లీ పర్యటన అనంతరం సీఎం బుధవారం రాష్ట్రానికి తిరిగి వస్తారు. 

ఇదీ చదవండి:

ప్రధాని మోదీ చెబితే జగన్‌ వింటారేమో..!: జేసీ

Last Updated : Jun 2, 2020, 12:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.