ETV Bharat / city

YSRCP: జిల్లా కేంద్రం ఇచ్చాం కదా?.. ఇలాగైతే ఎలా? !

author img

By

Published : May 7, 2022, 5:11 AM IST

మంత్రిమండలిలో చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఎమ్మెల్యేలతో సర్దుబాటు చర్చలను వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా చేపట్టారు. కచ్చితంగా పదవి వస్తుందని భావించి, నిరాశ చెందినవారితో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పటికే 10-12 మందిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ చర్చల్లో పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్​ సమావేశం
పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్​ సమావేశం

జిల్లా కేంద్రం ఇచ్చాం కదా? : ‘మీకు జిల్లా కేంద్రం ఇచ్చాం కదా? మళ్లీ మంత్రి పదవి కూడా ఇస్తే మీపై ఇతరులకు ఈర్ష్య పెరుగుతుంది. దానివల్ల వచ్చే ఎన్నికల్లో మీకే ఇబ్బంది రావచ్చు’ అని కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం అన్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, కోన రఘుపతి, గ్రంధి శ్రీనివాస్‌, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి వారితో ముఖ్యమంత్రి ఇలా అన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరికొందరితోనూ జిల్లా కేంద్రం అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఇలాగైతే ఎలా? :‘మీరు తెదేపాపై గట్టిగా మాట్లాడటం లేదు, వారు(తెదేపా) ప్రభుత్వంపై, మనపై విమర్శలు చేసినప్పుడు మీరు గట్టిగా ప్రతిస్పందించాలి కదా? వారిపై ప్రతివిమర్శలు చేయడం లేదెందుకు? ఇలాగైతే మంత్రిమండలిలోకి వచ్చినపుడు ప్రభుత్వాన్ని డిఫెండ్‌ చేయలేకపోవచ్చు కదా’ అని మరికొందరు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అన్నట్లు విశ్వసనీయ సమాచారం. తెదేపాను విమర్శించనివారికి పదవి ఇవ్వకపోతే... కొత్త మంత్రుల్లో ఒక మహిళతో పాటు మరికొందరు తెదేపాను ఎప్పుడు తిట్టారని అంతర్గతంగా నేతల్లో చర్చ జరుగుతోంది. ఒకరిద్దరికి మాత్రం ముఖ్యమంత్రి స్పష్టమైన భరోసా ఇచ్చారన్న ప్రచారం ఉంది. మిగిలిన వారిలో ఎక్కువమందికి సామాజిక, రాజకీయ సమీకరణలు కుదరకపోవడం వల్ల పదవి ఇవ్వలేకపోయామని చెప్పినట్లు తెలిసింది.

మంత్రిపదవి కోల్పోయిన బాలినేని శ్రీనివాస రెడ్డి, మేకతోటి సుచరిత వంటివారితో పాటు మంత్రి పదవిని పొందలేకపోయిన ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, గ్రంధి శ్రీనివాస్‌, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి వంటివారితో ముఖ్యమంత్రి ఇప్పటికే స్వయంగా మాట్లాడారు. గొల్ల బాబూరావు లాంటి ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

ఇదీ చదవండి: 'పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం.. సాగు బోర్లకు త్వరలోనే విద్యుత్​ మీటర్లు'

జిల్లా కేంద్రం ఇచ్చాం కదా? : ‘మీకు జిల్లా కేంద్రం ఇచ్చాం కదా? మళ్లీ మంత్రి పదవి కూడా ఇస్తే మీపై ఇతరులకు ఈర్ష్య పెరుగుతుంది. దానివల్ల వచ్చే ఎన్నికల్లో మీకే ఇబ్బంది రావచ్చు’ అని కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం అన్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, కోన రఘుపతి, గ్రంధి శ్రీనివాస్‌, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి వారితో ముఖ్యమంత్రి ఇలా అన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరికొందరితోనూ జిల్లా కేంద్రం అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఇలాగైతే ఎలా? :‘మీరు తెదేపాపై గట్టిగా మాట్లాడటం లేదు, వారు(తెదేపా) ప్రభుత్వంపై, మనపై విమర్శలు చేసినప్పుడు మీరు గట్టిగా ప్రతిస్పందించాలి కదా? వారిపై ప్రతివిమర్శలు చేయడం లేదెందుకు? ఇలాగైతే మంత్రిమండలిలోకి వచ్చినపుడు ప్రభుత్వాన్ని డిఫెండ్‌ చేయలేకపోవచ్చు కదా’ అని మరికొందరు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అన్నట్లు విశ్వసనీయ సమాచారం. తెదేపాను విమర్శించనివారికి పదవి ఇవ్వకపోతే... కొత్త మంత్రుల్లో ఒక మహిళతో పాటు మరికొందరు తెదేపాను ఎప్పుడు తిట్టారని అంతర్గతంగా నేతల్లో చర్చ జరుగుతోంది. ఒకరిద్దరికి మాత్రం ముఖ్యమంత్రి స్పష్టమైన భరోసా ఇచ్చారన్న ప్రచారం ఉంది. మిగిలిన వారిలో ఎక్కువమందికి సామాజిక, రాజకీయ సమీకరణలు కుదరకపోవడం వల్ల పదవి ఇవ్వలేకపోయామని చెప్పినట్లు తెలిసింది.

మంత్రిపదవి కోల్పోయిన బాలినేని శ్రీనివాస రెడ్డి, మేకతోటి సుచరిత వంటివారితో పాటు మంత్రి పదవిని పొందలేకపోయిన ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, గ్రంధి శ్రీనివాస్‌, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి వంటివారితో ముఖ్యమంత్రి ఇప్పటికే స్వయంగా మాట్లాడారు. గొల్ల బాబూరావు లాంటి ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

ఇదీ చదవండి: 'పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం.. సాగు బోర్లకు త్వరలోనే విద్యుత్​ మీటర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.