ETV Bharat / city

విద్యార్థిని హత్యపై సీఎం జగన్ ఆరా.. కఠిన చర్యలకు ఆదేశం - నరసరావుపేటలో విద్యార్థిని హత్య వార్తలు

నరసరావుపేటలో విద్యార్థిని హత్య ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షలు సాయం చేయటంతో పాటు.. దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Feb 24, 2021, 9:59 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యార్థిని అనూష హత్య ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న సీఎం.. అనూష కుటుంబానికి రూ.10 లక్షలు సాయం చేయటంతో పాటు.. విద్యార్థిని కుటుంబానికి భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దిశ చట్టం కింద దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ఇదీ చదవండి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యార్థిని అనూష హత్య ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న సీఎం.. అనూష కుటుంబానికి రూ.10 లక్షలు సాయం చేయటంతో పాటు.. విద్యార్థిని కుటుంబానికి భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దిశ చట్టం కింద దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ఇదీ చదవండి

నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య..మృతదేహంతో విద్యార్థుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.