ETV Bharat / city

CLAP: పురపాలికల్లో ఆగస్టు 8 నుంచి 'క్లాప్': మంత్రి బొత్స

author img

By

Published : Jul 5, 2021, 4:40 PM IST

క్లాప్ (Clean AndhraPradesh Programme) కార్యక్రమాన్ని ఆగస్టు 8 నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి బొత్స (Minister Botsa Satyanarayana) వెల్లడించారు. విజయనగరంలో మాట్లాడిన మంత్రి.. పరిశుభ్రతలో ఏపీ (AP)ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నూతన పన్ను విధానంతో ప్రజలపై ఏ మాత్రం భారం ఉండదని స్పష్టం చేశారు.

minister botsa satyanarayana
minister botsa satyanarayana

రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో ఆగస్టు 15 నుంచి 'క్లాప్' కార్యక్రమం (Clean AndhraPradesh Programme)) అమలు చేస్తున్నట్లు పురపాలిక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (minister botsa satyanarayana) తెలిపారు. మొదట ఈ నెల 8న ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆగస్టు 15 న 'క్లాప్'కు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కోటీ 48 లక్షల రూపాయలతో చేపట్టిన అదనపు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పరిశుభ్రతలో ఏపీని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా క్లాప్​ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4500 నుంచి 5000 వరకు ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేశామని చెప్పారు. చెత్తశుద్ధి యంత్రాలన కూడా సిద్ధం చేశామన్నారు. పురపాలికల్లో నూతన పన్ను విధానాన్ని హడావుడిగా తీసుకురాలేదని స్పష్టం చేశారు. 15 వ ఆర్థిక సంఘం సూచనలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన అధ్యాయనం ఆధారంగా కొత్త పన్ను విధానానికి రూపకల్పన చేశామన్నారు. దీనిపై త్వరలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలపై ఏ మాత్రం భారం ఉండదని మంత్రి బొత్స.. మరోసారి పునరుద్ఘాటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో ఆగస్టు 15 నుంచి 'క్లాప్' కార్యక్రమం (Clean AndhraPradesh Programme)) అమలు చేస్తున్నట్లు పురపాలిక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (minister botsa satyanarayana) తెలిపారు. మొదట ఈ నెల 8న ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆగస్టు 15 న 'క్లాప్'కు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కోటీ 48 లక్షల రూపాయలతో చేపట్టిన అదనపు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పరిశుభ్రతలో ఏపీని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా క్లాప్​ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4500 నుంచి 5000 వరకు ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేశామని చెప్పారు. చెత్తశుద్ధి యంత్రాలన కూడా సిద్ధం చేశామన్నారు. పురపాలికల్లో నూతన పన్ను విధానాన్ని హడావుడిగా తీసుకురాలేదని స్పష్టం చేశారు. 15 వ ఆర్థిక సంఘం సూచనలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన అధ్యాయనం ఆధారంగా కొత్త పన్ను విధానానికి రూపకల్పన చేశామన్నారు. దీనిపై త్వరలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలపై ఏ మాత్రం భారం ఉండదని మంత్రి బొత్స.. మరోసారి పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి:

కేఆర్​ఎంబీకి తెలంగాణ మరో లేఖ... త్రిసభ్య కమిటీ భేటీ వాయిదాకు వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.