ETV Bharat / city

రైల్వే శాఖ ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆందోళన

author img

By

Published : Jul 18, 2020, 12:54 AM IST

దేశ ఆర్థికవ్యవస్థకు, ఉపాధి కల్పనలో పట్టుకొమ్మగా ఉన్న భారతీయ రైల్వే ప్రైవేటికరణ చర్యలను యావత్ కార్మికవర్గం, ప్రజానీకం తిప్పికొట్టాలని రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని రైల్వేస్టేషన్ల ముందు సీఐటీయూ నాయకులు చేరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరించే చర్యలను విడనాడకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

citu protest on railway privatisation in ap state
రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ధర్నా

శ్రీకాకుళం జిల్లాలో..

రైల్వేను ప్రైవేటీకరణ చేయవద్దని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళం రోడ్డు, పలాస రైల్వే స్టేషన్ల వద్ద ఆందోళన చేపట్టారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేయడం తగదన్నారు. కరోనా కాలంలో ప్రజల ఇబ్బందులను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. రైల్వే శాఖను కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి.

విశాఖ జిల్లాలో..

రైల్వే ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. పిలుపులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ ఇతర ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని చీడికాడలో డివిజన్ స్థాయిలో సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే, వైద్యం ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.

కృష్ణా జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణ ప్రయత్నాలు వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పులు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు అనుకూలంగా చర్యలు చేపట్టడం గర్హనీయం అన్నారు.

గుంటూరు జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నేతాజీ డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న నిర్ణయాలను మార్చుకోకపోతే పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని అయన హెచ్చరించారు.

ప్రకాశం జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణను నిరాకరిస్తూ చీరాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ను అవకాశంగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని సీపీఎం చీరాల కమిటీ కార్యదర్శి బాబూరావు ఆరోపించారు. లాభాల బాటలో ఉన్న రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నెల్లూరు జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ ధర్నా చేపట్టింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వేగంగా చర్యలు చేపట్టడం అన్యాయమని సీఐటీయూ నేత అజయ్ కుమార్ విమర్శించారు. ప్రజా ధనంతో ఏర్పాటైన రైల్వే వ్యవస్థను ప్రైవేటు వారికి దారాదత్తం చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైల్వే శాఖను ప్రైవేటీకరిస్తే ప్రజలకు అందే ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కడప జిల్లాలో..

కమలాపురంలో రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కమనురు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైల్వేలో 109 లైన్లు, 151 రైళ్ళను ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పడానికి మోదీ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సరికాదని శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రైవేటీకరణ జరిగితే వెనుకబడిన దళితులు, గిరిజనులు రాబోయే కాలంలో ఉద్యోగాలకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైల్వే ప్రైవేటికరణ కోసం జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం స్టేషన్ మాస్టర్ కు వినతిపత్రం అందజేశారు.

కర్నూలు జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. రైల్వేను ప్రవేటు పరం చేస్తే ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా రైల్వే ఆస్తులను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఐటీయూ నాయకులు అన్నారు.

అనంతపురం జిల్లాలో..

రైల్వేలను ప్రైవేటీకరణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణం చేయడం ఆపాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఉద్ధృతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే విధానాలను నిరసిస్తూ రాయదుర్గం రైల్వే స్టేషన్ వద్ద సీఐటీయూ నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో అతి పెద్దదైన రైల్వే శాఖను... కొద్ది మంది పెట్టుబడుదారులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయుకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

'రైల్వేల ప్రైవేటీకరణ యత్నాన్ని కేంద్రం విరమించుకోవాలి'

శ్రీకాకుళం జిల్లాలో..

రైల్వేను ప్రైవేటీకరణ చేయవద్దని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళం రోడ్డు, పలాస రైల్వే స్టేషన్ల వద్ద ఆందోళన చేపట్టారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేయడం తగదన్నారు. కరోనా కాలంలో ప్రజల ఇబ్బందులను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. రైల్వే శాఖను కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి.

విశాఖ జిల్లాలో..

రైల్వే ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. పిలుపులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ ఇతర ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని చీడికాడలో డివిజన్ స్థాయిలో సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే, వైద్యం ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.

కృష్ణా జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణ ప్రయత్నాలు వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పులు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు అనుకూలంగా చర్యలు చేపట్టడం గర్హనీయం అన్నారు.

గుంటూరు జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నేతాజీ డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న నిర్ణయాలను మార్చుకోకపోతే పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని అయన హెచ్చరించారు.

ప్రకాశం జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణను నిరాకరిస్తూ చీరాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ను అవకాశంగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని సీపీఎం చీరాల కమిటీ కార్యదర్శి బాబూరావు ఆరోపించారు. లాభాల బాటలో ఉన్న రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నెల్లూరు జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ ధర్నా చేపట్టింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వేగంగా చర్యలు చేపట్టడం అన్యాయమని సీఐటీయూ నేత అజయ్ కుమార్ విమర్శించారు. ప్రజా ధనంతో ఏర్పాటైన రైల్వే వ్యవస్థను ప్రైవేటు వారికి దారాదత్తం చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైల్వే శాఖను ప్రైవేటీకరిస్తే ప్రజలకు అందే ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కడప జిల్లాలో..

కమలాపురంలో రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కమనురు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైల్వేలో 109 లైన్లు, 151 రైళ్ళను ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పడానికి మోదీ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సరికాదని శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రైవేటీకరణ జరిగితే వెనుకబడిన దళితులు, గిరిజనులు రాబోయే కాలంలో ఉద్యోగాలకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైల్వే ప్రైవేటికరణ కోసం జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం స్టేషన్ మాస్టర్ కు వినతిపత్రం అందజేశారు.

కర్నూలు జిల్లాలో..

రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. రైల్వేను ప్రవేటు పరం చేస్తే ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా రైల్వే ఆస్తులను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఐటీయూ నాయకులు అన్నారు.

అనంతపురం జిల్లాలో..

రైల్వేలను ప్రైవేటీకరణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణం చేయడం ఆపాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఉద్ధృతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే విధానాలను నిరసిస్తూ రాయదుర్గం రైల్వే స్టేషన్ వద్ద సీఐటీయూ నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో అతి పెద్దదైన రైల్వే శాఖను... కొద్ది మంది పెట్టుబడుదారులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయుకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

'రైల్వేల ప్రైవేటీకరణ యత్నాన్ని కేంద్రం విరమించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.