ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగ జరుపుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ వచ్చిందంటే ఆ ఉత్సాహం ఎంత రంగులమయంగా ఉంటుందో అందరికీ తెలుసునన్న ఆయన.. ఈసారి ఆ ఉత్సాహాన్ని కరోనా వైరస్ నీరుగార్చిందన్నారు. పండుగ ప్రతి ఏటా వస్తుంది కాబట్టీ మరేం పరవాలేదంటూ ప్రజలందరికీ ట్విటర్లో హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
సురక్షితంగా హోలీ జరుపుకోవాలి:లోకేశ్
రసాయన రంగులకు బదులు సహజసిద్ద రంగులతో సురక్షితంగా హోలీ జరపుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. వసంతోత్సవంగా చెప్పుకునే ఈ పండుగ ప్రతి ఇంటికీ నిత్య వసంతాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా అని ట్విటర్ వేదికగా హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి : లోకల్ ఫైట్: ఎవరు అర్హులు..ఎవరు అనర్హులో తెలుసా?