ETV Bharat / city

అధికార పార్టీ అహంకారంతోనే బలహీనవర్గాలపై దాడులు: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి.. చివరికి ఆమె ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో.. నిందితుడు వైకాపా నాయకుడే అన్నారు.. తెదేపా అధినేత చంద్రబాబు. అధికార పార్టీ అహంకార ధోరణి కారణంగానే.. బలహీనవర్గాలపై ఇలాంటి దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆగ్రహించారు.

chandrababu
chandrababu
author img

By

Published : Sep 4, 2020, 3:41 PM IST

వైకాపా పాలనలో బలహీనవర్గాలపై దమనకాండ కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. బలహీనవర్గానికి చెందిన యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని వైకాపా నేత న‌మ్మించి మోస‌గించాడని మండిపడ్డారు. అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో.. ముదినేపల్లిలోని మచ్చా ధనలక్ష్మి ఇంటిని వైకాపా నాయకులు తగలబెట్టారన్నారు.

ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయిందని అన్నారు. అధికార పార్టీ అహంకార ధోరణి వలన 15 నెలల పాలనలో బలహీనవర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆగ్రహించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

వైకాపా పాలనలో బలహీనవర్గాలపై దమనకాండ కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. బలహీనవర్గానికి చెందిన యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని వైకాపా నేత న‌మ్మించి మోస‌గించాడని మండిపడ్డారు. అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో.. ముదినేపల్లిలోని మచ్చా ధనలక్ష్మి ఇంటిని వైకాపా నాయకులు తగలబెట్టారన్నారు.

ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయిందని అన్నారు. అధికార పార్టీ అహంకార ధోరణి వలన 15 నెలల పాలనలో బలహీనవర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆగ్రహించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

బాణసంచా కర్మాగారంలో పేలుడు- 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.