ETV Bharat / city

అరాచకాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు: చంద్రబాబు - Chandrababu

వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతటి పైశాచిక పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. తెలుగుదేశం నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ రాజకీయంగా కక్ష సాధిస్తోందని ధ్వజమెత్తారు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన డీజీపీ అధికార పార్టీ ఒత్తిడితో నిస్సహాయంగా మారారని విమర్శించారు.

చంద్రబాబు
author img

By

Published : Sep 13, 2019, 11:08 PM IST

Updated : Sep 14, 2019, 3:13 AM IST

వైకాపా పాలనపై చంద్రబాబు ధ్వజం

తెలుగుదేశం న్యాయవిభాగం ప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం విడివిడిగా సమావేశమైన చంద్రబాబు నాయకులపై కేసులు, శ్రేణులపై దాడుల విషయంపై చర్చించారు. వైకాపా నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా ఎలాంటి కేసులు పెట్టకుండా ఏ తప్పూ చేయని తెదేపా నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో కుటుంబరావు సోదరుల భూమికి సంబంధించి సుప్రీంకోర్టు స్టేటస్‌కో ఆదేశాలు ఇచ్చినా ఆ స్థలంలో హెచ్చరిక బోర్డులు పెట్టి చట్టాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. 37ఏళ్ల క్రితం ఆస్తి వ్యవహారంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి డాక్యుమెంట్లు చూపమంటూ వేధిస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఎప్పుడో ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాలపై పోరాడిన కేసులకు సంబంధించి చినరాజప్పపై, ఇతర నాయకులపైనా పాత కేసులు తవ్వితీసి ఈసీకి ఫిర్యాదులు పంపారన్నారు. "చలో ఆత్మకూరు" సందర్భంగా తమ ఇంటి సమీపంలో ఆంక్షలు లేని సమయంలో అచ్చెన్నాయుడు ఉల్లంఘించినట్లు తప్పుడు కేసు బనాయించారని, పోలీసు అధికారిని ఒక్కమాట అనకపోయినా నన్నపనేని రాజకుమారిపై అక్రమ కేసు పెట్టారని గుర్తుచేశారు.

కార్యకర్త హత్యను ఖండించిన చంద్రబాబు

నెల్లూరు జిల్లా అనాసాగరం మండలంలో జరిగిన తెదేపా నాయుకుడు వెంగయ్య హత్యను చంద్రబాబు ఖండించారు. నెల్లూరులో ఈ తరహా దాడులు గతంలో లేవని వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రశాంతమైన జిల్లాలనూ రక్తసిక్తం చేస్తున్నారని ఆరోపించారు. జగ్గయ్యపేటలో పార్టీ కార్యకర్త సలీంపై కత్తులతో దాడి చేయడం, వడ్డెర మహిళ నరసమ్మపై దౌర్జన్యం, కడప జిల్లా జమ్మలమడుగులో 12ఎకరాల్లో పత్తి పంట నాశనం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పులివెందులలో నాగభూషణరెడ్డి ఇల్లు కూలగొడుతున్న ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందన్నారు. రాయదుర్గం పరిధిలోని బేలోడులో తెదేపా కార్యకర్తలపై దాడి పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. వినాయకుని నిమజ్జనం, మొహర్రం వేడుకలను దాడులకు వేదికలుగా మార్చుకుని ప్రశాంతంగా పండగ చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని ధ్వజమెత్తారు.

బాధిత మహిళలకు భరోసా

గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు మహిళలు చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. గత ఎన్నికల్లో తమ ఊళ్లో తెలుగుదేశానికి 500కు పైగా మెజార్టీ వచ్చిందని కక్షతో దాడులకు పాల్పడ్డారని చెప్పారు. రాళ్లు, నాటు కర్రలు, కొబ్బరిబోండాలతో మహిళలపై దాడి చేశారని వివరించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, పార్టీ తరఫున అండగా ఉంటామని వారికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ధైర్యంగా పోరాడాలని సూచించారు

వైకాపా పాలనపై చంద్రబాబు ధ్వజం

తెలుగుదేశం న్యాయవిభాగం ప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం విడివిడిగా సమావేశమైన చంద్రబాబు నాయకులపై కేసులు, శ్రేణులపై దాడుల విషయంపై చర్చించారు. వైకాపా నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా ఎలాంటి కేసులు పెట్టకుండా ఏ తప్పూ చేయని తెదేపా నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో కుటుంబరావు సోదరుల భూమికి సంబంధించి సుప్రీంకోర్టు స్టేటస్‌కో ఆదేశాలు ఇచ్చినా ఆ స్థలంలో హెచ్చరిక బోర్డులు పెట్టి చట్టాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. 37ఏళ్ల క్రితం ఆస్తి వ్యవహారంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి డాక్యుమెంట్లు చూపమంటూ వేధిస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఎప్పుడో ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాలపై పోరాడిన కేసులకు సంబంధించి చినరాజప్పపై, ఇతర నాయకులపైనా పాత కేసులు తవ్వితీసి ఈసీకి ఫిర్యాదులు పంపారన్నారు. "చలో ఆత్మకూరు" సందర్భంగా తమ ఇంటి సమీపంలో ఆంక్షలు లేని సమయంలో అచ్చెన్నాయుడు ఉల్లంఘించినట్లు తప్పుడు కేసు బనాయించారని, పోలీసు అధికారిని ఒక్కమాట అనకపోయినా నన్నపనేని రాజకుమారిపై అక్రమ కేసు పెట్టారని గుర్తుచేశారు.

కార్యకర్త హత్యను ఖండించిన చంద్రబాబు

నెల్లూరు జిల్లా అనాసాగరం మండలంలో జరిగిన తెదేపా నాయుకుడు వెంగయ్య హత్యను చంద్రబాబు ఖండించారు. నెల్లూరులో ఈ తరహా దాడులు గతంలో లేవని వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రశాంతమైన జిల్లాలనూ రక్తసిక్తం చేస్తున్నారని ఆరోపించారు. జగ్గయ్యపేటలో పార్టీ కార్యకర్త సలీంపై కత్తులతో దాడి చేయడం, వడ్డెర మహిళ నరసమ్మపై దౌర్జన్యం, కడప జిల్లా జమ్మలమడుగులో 12ఎకరాల్లో పత్తి పంట నాశనం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పులివెందులలో నాగభూషణరెడ్డి ఇల్లు కూలగొడుతున్న ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందన్నారు. రాయదుర్గం పరిధిలోని బేలోడులో తెదేపా కార్యకర్తలపై దాడి పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. వినాయకుని నిమజ్జనం, మొహర్రం వేడుకలను దాడులకు వేదికలుగా మార్చుకుని ప్రశాంతంగా పండగ చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని ధ్వజమెత్తారు.

బాధిత మహిళలకు భరోసా

గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు మహిళలు చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. గత ఎన్నికల్లో తమ ఊళ్లో తెలుగుదేశానికి 500కు పైగా మెజార్టీ వచ్చిందని కక్షతో దాడులకు పాల్పడ్డారని చెప్పారు. రాళ్లు, నాటు కర్రలు, కొబ్బరిబోండాలతో మహిళలపై దాడి చేశారని వివరించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, పార్టీ తరఫున అండగా ఉంటామని వారికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ధైర్యంగా పోరాడాలని సూచించారు

Intro:AP_GNT_30_13_IDI_SANGATI_UNIVERSITY_BITE_AP10032


Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:bite


Conclusion:రామినేని శివరామ ప్రసాద్, డీన్, వాణిజ్య విభాగం, ఏ ఎన్ యూ
Last Updated : Sep 14, 2019, 3:13 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.