ETV Bharat / city

సీఎం​తో సెంచురీ ప్ల్లై బోర్టు ఇండియా సంస్థ సీఎండీ భేటీ... ఎందుకంటే..!

author img

By

Published : Aug 25, 2021, 8:14 PM IST

సెంచురి ప్లై బోర్డు ఇండియా సంస్థ సీఎండీ సజ్జన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. కడపజిల్లా బద్వేలులో ఏర్పాటు చేయనున్న ప్లాంట్​కు సంబంధించిన అంశాలపై చర్చించారు.

సీఎం జగన్ తో సెంచురీ ప్ల్లై బోర్టు ఇండియా సంస్థ సీఎండీ సజ్జన్ భేటీ
సీఎం జగన్ తో సెంచురీ ప్ల్లై బోర్టు ఇండియా సంస్థ సీఎండీ సజ్జన్ భేటీ

సెంచురీ ప్లై బోర్డు ఇండియా సంస్థ సీఎండీ సజ్జన్.... సీఎం జగన్​తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతోపాటు ముఖ్యమంత్రిని కలిశారు. కడప జిల్లా బద్వేలులో ఏర్పాటు చేయనున్న ప్లాంట్​కు సంబంధించిన అంశాలపై చర్చించారు. వెయ్యి కోట్ల రూపాయలతో మూడు దశల్లో.... ప్లై వుడ్ ఉత్పత్తి యూనిట్లను సెంచూరీ సంస్థ ఏర్పాటు చేయనుంది.

డిసెంబర్ 2022 నాటికి మొదటి దశలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమని సంస్థ వెల్లడించింది. ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని మొదటి విడతగా.... నిర్మాణం పూర్తయ్యాక 10 లక్షల మెట్రిక్ టన్నుల పూర్తిస్ధాయి సామర్ధ్యంతో ఉత్పత్తి చేయనున్నట్టు సీఎంకు తెలిపారు. బద్వేలు యూనిట్​లో 3వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. తమ యూనిట్ ద్వారా యూకలిప్టస్ రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు.

సెంచురీ ప్లై బోర్డు ఇండియా సంస్థ సీఎండీ సజ్జన్.... సీఎం జగన్​తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతోపాటు ముఖ్యమంత్రిని కలిశారు. కడప జిల్లా బద్వేలులో ఏర్పాటు చేయనున్న ప్లాంట్​కు సంబంధించిన అంశాలపై చర్చించారు. వెయ్యి కోట్ల రూపాయలతో మూడు దశల్లో.... ప్లై వుడ్ ఉత్పత్తి యూనిట్లను సెంచూరీ సంస్థ ఏర్పాటు చేయనుంది.

డిసెంబర్ 2022 నాటికి మొదటి దశలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమని సంస్థ వెల్లడించింది. ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని మొదటి విడతగా.... నిర్మాణం పూర్తయ్యాక 10 లక్షల మెట్రిక్ టన్నుల పూర్తిస్ధాయి సామర్ధ్యంతో ఉత్పత్తి చేయనున్నట్టు సీఎంకు తెలిపారు. బద్వేలు యూనిట్​లో 3వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. తమ యూనిట్ ద్వారా యూకలిప్టస్ రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.