ETV Bharat / city

తెలంగాణ: 6 తో కలిపి 35.. విలువ సుమారు రూ. 7 లక్షల 50 వేలు

author img

By

Published : Jan 29, 2021, 10:52 PM IST

అతడు సెల్ ఫోన్​ దొంగ. ఓహ్​ అంతేనా అంటారా.? అదేదో వృత్తి ధర్మం అన్నట్టుగా ఇప్పటివరకు 36 సెల్​ఫోన్లు దొంగిలించాడు.! కొంచం ఇంట్రెస్ట్​గా ఉందికదా..? వాటి విలువ అక్షరాల సుమారు రూ. 7 లక్షల 50 వేలు.! మరి ఇంత ట్రాక్​ రికార్డ్​ ఉన్న అతగాడిని పోలీసులు ఊరికే వదులుతారా..? ఆ దొంగ గారిని పోలీసులు అరెస్ట్​ చేసి.. మర్యాదలు చేస్తున్నారు. దీనిలో ట్విస్ట్​ ఏంటటే..? ఆ ఫోన్​లను కొంటున్న వ్యక్తి కూడా అరెస్ట్​ అవడం.

తెలంగాణ:  6 తో కలిపి 35.. విలువ సుమారు రూ. 7 లక్షల 50 వేలు
తెలంగాణ: 6 తో కలిపి 35.. విలువ సుమారు రూ. 7 లక్షల 50 వేలు

ఈజీ మనీ కోసం సెల్ ఫోన్ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్న ఓ సెల్ ఫోన్ దొంగను తెలంగాణ మేడ్చల్​-మల్కాజ్​గిరి జిల్లా జీడిమెట్ల పోలీసులు అరెస్ట్​ చేశారు. షాపూర్​నగర్​లో నివాసం ఉండే మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 19న తన రూమ్​లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లాడు. వచ్చి చూసేరికి ఫోన్​ కనిపించకుండా పోయింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దొంగపై నిఘా..

పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సెల్ ఫోన్ దొంగపై నిఘా పెట్టారు. నేడు ఉదయం ఓ వ్యక్తి 6 సెల్ ఫోన్​లను షాపూర్​నగర్ మార్కెట్​లో అమ్ముతున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అక్కడికి చేరుకుని సెల్ ఫోన్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు. సదరు దొంగ.. రొడామిస్త్రీ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే షేక్ మహబూబ్​గా పోలీసులు గుర్తించారు. మహేష్ రెడ్డి సెల్ ఫోన్​ను దొంగలించింది కూడా ఇతగాడే..!

6 తో కలిపి 35..

షేక్ మహబూబ్ గతంలో 29 సెల్ ఫోన్​లు దొంగతనం చేసినట్టు తమ‌ విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 7లక్షల 50 వేలు ఉంటుందని వెల్లడించారు. షేక్ మహబూబ్​తో పాటు దొంగ సెల్​ఫోన్​లను కొంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్​ చేశారు. ఇద్దరిని రిమాండ్​కు పంపుతున్నామని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు.

అలా దొంగతనం చేసినందుకు, దొంగ ఫోన్​లను కొంటున్నందుకు ఇద్దరూ కటకటాలపాలయ్యారన్నమాట.

ఇదీ చూడండి: విషాదం: వేరువేరు ఘటనల్లో ఇద్దరు యువకుల బలవన్మరణం

ఈజీ మనీ కోసం సెల్ ఫోన్ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్న ఓ సెల్ ఫోన్ దొంగను తెలంగాణ మేడ్చల్​-మల్కాజ్​గిరి జిల్లా జీడిమెట్ల పోలీసులు అరెస్ట్​ చేశారు. షాపూర్​నగర్​లో నివాసం ఉండే మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 19న తన రూమ్​లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లాడు. వచ్చి చూసేరికి ఫోన్​ కనిపించకుండా పోయింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దొంగపై నిఘా..

పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సెల్ ఫోన్ దొంగపై నిఘా పెట్టారు. నేడు ఉదయం ఓ వ్యక్తి 6 సెల్ ఫోన్​లను షాపూర్​నగర్ మార్కెట్​లో అమ్ముతున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అక్కడికి చేరుకుని సెల్ ఫోన్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు. సదరు దొంగ.. రొడామిస్త్రీ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే షేక్ మహబూబ్​గా పోలీసులు గుర్తించారు. మహేష్ రెడ్డి సెల్ ఫోన్​ను దొంగలించింది కూడా ఇతగాడే..!

6 తో కలిపి 35..

షేక్ మహబూబ్ గతంలో 29 సెల్ ఫోన్​లు దొంగతనం చేసినట్టు తమ‌ విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 7లక్షల 50 వేలు ఉంటుందని వెల్లడించారు. షేక్ మహబూబ్​తో పాటు దొంగ సెల్​ఫోన్​లను కొంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్​ చేశారు. ఇద్దరిని రిమాండ్​కు పంపుతున్నామని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు.

అలా దొంగతనం చేసినందుకు, దొంగ ఫోన్​లను కొంటున్నందుకు ఇద్దరూ కటకటాలపాలయ్యారన్నమాట.

ఇదీ చూడండి: విషాదం: వేరువేరు ఘటనల్లో ఇద్దరు యువకుల బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.