ETV Bharat / city

పురపోరు: విజేతలను ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 14న జరగనుంది. ఆ రోజున కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ కౌంటింగ్ నిర్వహిస్తారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో తాము చెప్పే వరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలివ్వగా... అక్కడ ముందస్తుగా కౌంటింగ్ కేంద్రాలను నిర్ణయించారు.

author img

By

Published : Mar 11, 2021, 8:20 PM IST

పురపోరు: విజేతలను ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి
పురపోరు: విజేతలను ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 14న పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం కౌంటింగ్ కేంద్రాలను నిర్ణయించారు. కార్పొరేషన్లలో స్థానికంగా కేంద్రం ఏర్పాటు చేసి డివిజన్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. 12 కార్పొరేషన్లలో స్థానికంగా 17 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. తాము చెప్పేవరకు ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపల్ ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేంద్రాల్లోనూ ఓట్ల లెక్కింపు కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది.

విజయనగరం కార్పొరేషన్​కు సంబంధించి పాత బస్టాండ్ సమీపంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్​లో ఓట్లను లెక్కించనున్నారు. విశాఖపట్నం కార్పొరేషన్​కు సంబంధించి వాల్తేరులోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు చేపడతారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్​కు సంబంధించి వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ కార్పొరేషన్​కు సంబంధించి ఓట్ల లెక్కింపును ఆంధ్ర లయోలా కళాశాలలో నిర్వహిస్తారు. మచిలీపట్నం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపును కృష్ణా యూనివర్సిటీలో చేపడతారు.

గుంటూరు కార్పొరేషన్లో స్థానికంగా 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్ న్యూబ్లాక్, నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్, ప్రభుత్వ టెక్స్​టైల్స్ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్​లో ఓట్లను లెక్కించనున్నారు. ఒంగోలు కార్పొరేషన్​లో సెయింట్ క్సావియర్ హైస్కూల్, కళాశాలలో, అనంతపురం కార్పొరేషన్​కు సంబంధించి స్థానిక ఎస్​ఎస్​బీఎమ్ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్నూలు కార్పొరేషన్లో 3 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాయలసీమ యూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల, పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిత్తూరు కార్పొరేషన్ పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో ఓట్లను లెక్కించనున్నారు. తిరుపతి కార్పొరేషన్​లో ఎస్​వీ ఆర్ట్స్ కళాశాలలో చేపడతారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎక్కడికక్కడ అన్ని వార్డులను కలిపి ఒకే కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్థానికంగా నిర్ణీత కేంద్రాల్లో 71 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాల వద్దకు తరలించేందుకు వీలుగా తగినన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ అవసరమైన మేరకు రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఎక్కడా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ఆదేశించారు.

ఇదీ చదవండీ... రవీంద్ర అరెస్టు: మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం

ఈ నెల 14న పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం కౌంటింగ్ కేంద్రాలను నిర్ణయించారు. కార్పొరేషన్లలో స్థానికంగా కేంద్రం ఏర్పాటు చేసి డివిజన్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. 12 కార్పొరేషన్లలో స్థానికంగా 17 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. తాము చెప్పేవరకు ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపల్ ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేంద్రాల్లోనూ ఓట్ల లెక్కింపు కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది.

విజయనగరం కార్పొరేషన్​కు సంబంధించి పాత బస్టాండ్ సమీపంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్​లో ఓట్లను లెక్కించనున్నారు. విశాఖపట్నం కార్పొరేషన్​కు సంబంధించి వాల్తేరులోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు చేపడతారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్​కు సంబంధించి వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ కార్పొరేషన్​కు సంబంధించి ఓట్ల లెక్కింపును ఆంధ్ర లయోలా కళాశాలలో నిర్వహిస్తారు. మచిలీపట్నం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపును కృష్ణా యూనివర్సిటీలో చేపడతారు.

గుంటూరు కార్పొరేషన్లో స్థానికంగా 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్ న్యూబ్లాక్, నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్, ప్రభుత్వ టెక్స్​టైల్స్ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్​లో ఓట్లను లెక్కించనున్నారు. ఒంగోలు కార్పొరేషన్​లో సెయింట్ క్సావియర్ హైస్కూల్, కళాశాలలో, అనంతపురం కార్పొరేషన్​కు సంబంధించి స్థానిక ఎస్​ఎస్​బీఎమ్ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్నూలు కార్పొరేషన్లో 3 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాయలసీమ యూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల, పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిత్తూరు కార్పొరేషన్ పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో ఓట్లను లెక్కించనున్నారు. తిరుపతి కార్పొరేషన్​లో ఎస్​వీ ఆర్ట్స్ కళాశాలలో చేపడతారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎక్కడికక్కడ అన్ని వార్డులను కలిపి ఒకే కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్థానికంగా నిర్ణీత కేంద్రాల్లో 71 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాల వద్దకు తరలించేందుకు వీలుగా తగినన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ అవసరమైన మేరకు రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఎక్కడా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ఆదేశించారు.

ఇదీ చదవండీ... రవీంద్ర అరెస్టు: మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.