ETV Bharat / city

లాక్​డౌన్​లో టికెట్లు తీసుకున్న ఆర్టీసీ ప్రయాణికులకు నగదు వాపస్​

author img

By

Published : Jul 14, 2020, 9:04 PM IST

Updated : Jul 15, 2020, 2:20 AM IST

ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. లాక్​డౌన్ సమయంలో టికెట్లు రద్దు చేసుకోలేని ప్రయాణికులకు నగదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరుతోంది.

refund
ఆర్టీసీ నగదు వాపస్

లాక్​డౌన్ సమయంలో బస్సు టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. గడువులోగా టికెట్లు రద్దు చేసుకోలేని ప్రయాణికులకు మరో అవకాశం కల్పించింది. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య ప్రయాణం కోసం టికెట్లు తీసుకున్న ప్రయాణికులు రద్దు చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

బుధవారం నుంచి 15 రోజుల్లోపు ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 29 లోపుగా ప్రయాణికులు తమ టికెట్లను బస్టాండ్లు లేదా ఎటీబీ కౌంటర్​లో చూపించి రద్దు చేసుకోవచ్చని వివరించారు. ప్రయాణికులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

లాక్​డౌన్ సమయంలో బస్సు టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. గడువులోగా టికెట్లు రద్దు చేసుకోలేని ప్రయాణికులకు మరో అవకాశం కల్పించింది. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య ప్రయాణం కోసం టికెట్లు తీసుకున్న ప్రయాణికులు రద్దు చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

బుధవారం నుంచి 15 రోజుల్లోపు ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 29 లోపుగా ప్రయాణికులు తమ టికెట్లను బస్టాండ్లు లేదా ఎటీబీ కౌంటర్​లో చూపించి రద్దు చేసుకోవచ్చని వివరించారు. ప్రయాణికులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

ఇదీ చదవండి: ఇంటర్ బోర్డు ఉద్యోగికి కరోనా.. 19 వరకు కార్యాలయం బంద్

Last Updated : Jul 15, 2020, 2:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.