తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి సంబంధించి ఆడ్హక్ అధికార ప్రతినిధులను నియమించినట్లు వైఎస్ షర్మిల కార్యాలయం ప్రకటించింది. వీరిలో కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు ఉన్నారు.
మరోవైపు వైఎస్ షర్మిల పార్టీ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నిక సంఘానికి.. షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. "వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ" పేరుతో దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ఈ ఆమోదం తెలిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.