ETV Bharat / city

'విద్యార్థుల ఇంటికొచ్చి అడ్మిషన్లు అడిగితే ఫిర్యాదు చేయండి'

author img

By

Published : Jun 24, 2020, 8:00 PM IST

అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులను విద్యార్థుల ఇళ్లకు పంపించటం మానుకోవాలని ప్రైవేటు పాఠశాలలను పాఠశాల విద్యనియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశించింది. ఈ తరహా చర్యలకు పాల్పడే ప్రైవేటు పాఠశాలల గురించి apsermc.ap.gov.in పోర్టల్ కు ఫిర్యాదులు పంపాలని ఆయన కోరారు.

ap school education regulatory and monitoring commission
ap school education regulatory and monitoring commission

ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల పేరుతో తమ ఉపాధ్యాయులను విద్యార్థుల ఇళ్లకు పంపించటం మానుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యనియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశించింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ సిబ్బంది వేతనాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించటం సరికాదని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు అన్నారు.

ఈ అంశంపై కమిషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించిన ఆయన.. నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా చర్యలకు పాల్పడితే గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ తరహా చర్యలకు పాల్పడే ప్రైవేటు పాఠశాలల గురించి apsermc.ap.gov.in పోర్టల్​కు ఫిర్యాదులు పంపాలని ఆయన కోరారు.

ఫిర్యాదులను పరిశీలించి ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ఫీజు చెల్లించలేదన్న కారణంగా ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు టీసీలు మంజూరు చేయకపోవటం దారుణమైన అంశమని పర్యవేక్షణ, నియంత్రణా కమిషన్ అభిప్రాయపడింది. ప్రైవేటు పాఠశాలల గుర్తింపు, రెన్యూవల్ కు సంబంధించిన జీవోను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేయాల్సి ఉందని దీనిపై సీబీఎస్సీ నిబంధనల్ని పరిగణనలోకి తీసుకునేలా సిఫార్సు చేస్తున్నట్టు వివరించారు.

ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల పేరుతో తమ ఉపాధ్యాయులను విద్యార్థుల ఇళ్లకు పంపించటం మానుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యనియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశించింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ సిబ్బంది వేతనాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించటం సరికాదని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు అన్నారు.

ఈ అంశంపై కమిషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించిన ఆయన.. నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా చర్యలకు పాల్పడితే గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ తరహా చర్యలకు పాల్పడే ప్రైవేటు పాఠశాలల గురించి apsermc.ap.gov.in పోర్టల్​కు ఫిర్యాదులు పంపాలని ఆయన కోరారు.

ఫిర్యాదులను పరిశీలించి ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ఫీజు చెల్లించలేదన్న కారణంగా ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు టీసీలు మంజూరు చేయకపోవటం దారుణమైన అంశమని పర్యవేక్షణ, నియంత్రణా కమిషన్ అభిప్రాయపడింది. ప్రైవేటు పాఠశాలల గుర్తింపు, రెన్యూవల్ కు సంబంధించిన జీవోను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేయాల్సి ఉందని దీనిపై సీబీఎస్సీ నిబంధనల్ని పరిగణనలోకి తీసుకునేలా సిఫార్సు చేస్తున్నట్టు వివరించారు.

ఇదీ చదవండి:

పార్టీని, అధ్యక్షుడినిగానీ పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.