ETV Bharat / city

అవసరమైతే కోర్టు ధిక్కరణ చర్యలకు వెనకాడబోం: హైకోర్టు

author img

By

Published : Dec 17, 2020, 4:50 PM IST

మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్​ను తప్పుకోవాలని ప్రభుత్వం రిక్విజల్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్​కు సంబంధించి జరిగిన వాదనల్లో ఆసక్తిక సంవాదం జరిగింది. హెబీస్ రిక్విజల్ పిటిషన్​పై పిటిషనర్లకు నోటీసులిచ్చారా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. నోటీసులు అందలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానం ఇవ్వడంతో.. ఇది కోర్టు ప్రొసీడింగ్స్​ను అడ్డుకోవడమేనని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే కోర్టు ధిక్కరణ చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది.

Ap high court
Ap high court
హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు

మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్​పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్​ను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్​కు సంబంధించి ఆసక్తికరమైన సంవాదం జరిగింది. హెబీస్ రిక్విజల్ పిటిషన్​పై పిటిషనర్లకు నోటీసులిచ్చారా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. తమకు నోటీసులు అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు సమాధానమివ్వగా....పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా విచారణలో ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ఏఏజీని కోర్టు ప్రశ్నించింది.

ఇది కోర్టు ప్రొసీడింగ్స్​ను అడ్డుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం... అవసరమైతే కోర్టు ధిక్కరణ చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది. సోమవారంలోగా పిటిషన్ దాఖలు చేయాలని.... ప్రభుత్వం విచారణకు సిద్ధం కాకుంటే తదుపరి చర్యలు చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం ఆస్తుల అమ్మకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తరఫున హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి : రాజధాని శంకుస్థాపన స్థలిలో ప్రణమిల్లిన చంద్రబాబు

హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు

మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్​పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్​ను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్​కు సంబంధించి ఆసక్తికరమైన సంవాదం జరిగింది. హెబీస్ రిక్విజల్ పిటిషన్​పై పిటిషనర్లకు నోటీసులిచ్చారా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. తమకు నోటీసులు అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు సమాధానమివ్వగా....పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా విచారణలో ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ఏఏజీని కోర్టు ప్రశ్నించింది.

ఇది కోర్టు ప్రొసీడింగ్స్​ను అడ్డుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం... అవసరమైతే కోర్టు ధిక్కరణ చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది. సోమవారంలోగా పిటిషన్ దాఖలు చేయాలని.... ప్రభుత్వం విచారణకు సిద్ధం కాకుంటే తదుపరి చర్యలు చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం ఆస్తుల అమ్మకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తరఫున హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి : రాజధాని శంకుస్థాపన స్థలిలో ప్రణమిల్లిన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.