తెలంగాణలోని భద్రాచలం క్షేత్ర శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములకు 1001 కలశాలతో అభిషేకం నిర్వహించారు. సమస్త నదీజలాలు, సముద్ర జలాలు, పళ్లరసాలు, పంచోదకములు, పాలు, తేనె, నెయ్యి, సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు.
అనంతరం మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. మహా పూర్ణాహుతి అనంతరం స్వామి వారికి ప్రధాన ఆలయంలో మహా నివేదన సమర్పిస్తారు. మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
శ్రీవారి సేవలో ప్రముఖులు.. పీఎస్ఎల్వీ-సీ51కు ఇస్రో ఛైర్మన్ పూజలు