ETV Bharat / city

Poor People in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో ఎంతమంది పేదలున్నారో తెలుసా? - తెలంగాణలో పేదరికం

Poor People in Telugu States 2021: దేశంలో అత్యధిక పేదలున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 20వ స్థానంలో ఉండగా.. తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బిహార్​ ఉంది. తెలంగాణలో 13.74 శాతం పేద ప్రజలున్నారని నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

తెలంగాణలో ఎంత మంది పేదలున్నారో తెలుసా?
తెలంగాణలో ఎంత మంది పేదలున్నారో తెలుసా?
author img

By

Published : Nov 27, 2021, 11:31 AM IST

Poor People in Telugu States 2021: ఆంధ్రప్రదేశ్​లో వివిధ రంగాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వారు 12.31% మేర ఉన్నట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థితిగతులను తెలుసుకోవడానికి నీతి ఆయోగ్‌ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ఆధారంగా రూపొందించిన బహుముఖ పేదరికం నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధిక సంఖ్యలో పేద రాష్ట్రాలుగా బిహార్‌ (5101 శాతం), ఝార్ఖండ్‌ (12.16), ఉత్తర్‌ప్రదేశ్‌ (91.70) తొలి మూడు స్టానాల్లో నిలిస్తే ఆంధ్రప్రదేశ్‌ 20, తెలంగాణ18వ స్థానాల్లో నిలిచాయి. కేరళలో (0.11%) అతి తక్కువ పేదలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక బహుముఖ పేదలు కర్నూలు, అతి తక్కువగా గుంటూరు జిల్లాలో ఉన్నట్లు వెల్లడించింది.

గు రాష్ట్రాల్లో ఎంతమంది పేదలున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్​లో ఎంతమంది పేదలున్నారో తెలుసా?

ఇప్పటివరకు పేదరికాన్ని అంచనా వేసేందుకు ఆదాయం, వినిమయం,ఖర్చులనే పరిగణనలోకి తీసుకుంటూ వచ్చారు. అయితే... పూర్తిగా ఆదాయం మీదే ఆధారపడి పేదరికాన్ని అంచనా

వేయలేమని, ప్రజలకు అందే మౌలిక సదుపాయాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు సూక్ష్మ స్థాయిలో తెలుసుకోవచ్చని, నీతి ఆయోగ్‌ భావించింది. ఆ మేరకు విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు వంటి సరళమైన సదుపాయాలు కొలమానంగా తీసుకొని ఈ 'మల్లీడైమెన్షనల్‌ పూర్‌ నివేదిక రూపొందించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పటిష్టమైన యంత్రాంగాన్ని సృష్టించడం, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీని పెంచడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుందని, ప్రభుత్వాలు ఈమేరకు వనరులు కేటాయించవచ్చని నీతిఆయోగ్‌ అభిప్రాయపడింది.

గు రాష్ట్రాల్లో ఎంతమంది పేదలున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్​లో ఎంతమంది పేదలున్నారో తెలుసా?

ఇవీ చదవండి :

'వచ్చే ఐదేళ్లలో వైద్య రంగంలో రూ.64 వేల కోట్లు వెచ్చిస్తాం'

Poor People in Telugu States 2021: ఆంధ్రప్రదేశ్​లో వివిధ రంగాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వారు 12.31% మేర ఉన్నట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థితిగతులను తెలుసుకోవడానికి నీతి ఆయోగ్‌ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ఆధారంగా రూపొందించిన బహుముఖ పేదరికం నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధిక సంఖ్యలో పేద రాష్ట్రాలుగా బిహార్‌ (5101 శాతం), ఝార్ఖండ్‌ (12.16), ఉత్తర్‌ప్రదేశ్‌ (91.70) తొలి మూడు స్టానాల్లో నిలిస్తే ఆంధ్రప్రదేశ్‌ 20, తెలంగాణ18వ స్థానాల్లో నిలిచాయి. కేరళలో (0.11%) అతి తక్కువ పేదలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక బహుముఖ పేదలు కర్నూలు, అతి తక్కువగా గుంటూరు జిల్లాలో ఉన్నట్లు వెల్లడించింది.

గు రాష్ట్రాల్లో ఎంతమంది పేదలున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్​లో ఎంతమంది పేదలున్నారో తెలుసా?

ఇప్పటివరకు పేదరికాన్ని అంచనా వేసేందుకు ఆదాయం, వినిమయం,ఖర్చులనే పరిగణనలోకి తీసుకుంటూ వచ్చారు. అయితే... పూర్తిగా ఆదాయం మీదే ఆధారపడి పేదరికాన్ని అంచనా

వేయలేమని, ప్రజలకు అందే మౌలిక సదుపాయాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు సూక్ష్మ స్థాయిలో తెలుసుకోవచ్చని, నీతి ఆయోగ్‌ భావించింది. ఆ మేరకు విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు వంటి సరళమైన సదుపాయాలు కొలమానంగా తీసుకొని ఈ 'మల్లీడైమెన్షనల్‌ పూర్‌ నివేదిక రూపొందించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పటిష్టమైన యంత్రాంగాన్ని సృష్టించడం, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీని పెంచడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుందని, ప్రభుత్వాలు ఈమేరకు వనరులు కేటాయించవచ్చని నీతిఆయోగ్‌ అభిప్రాయపడింది.

గు రాష్ట్రాల్లో ఎంతమంది పేదలున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్​లో ఎంతమంది పేదలున్నారో తెలుసా?

ఇవీ చదవండి :

'వచ్చే ఐదేళ్లలో వైద్య రంగంలో రూ.64 వేల కోట్లు వెచ్చిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.