ETV Bharat / city

‘అమరావతినే రాజధానిగా కొనసాగించాలి’

author img

By

Published : May 15, 2020, 1:19 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి దళిత ఐకాస నేతలు తుళ్లూరు మండలంలోని శాఖవరం  అంబేడ్కర్ స్మృతి వనం వద్ద దీక్ష చేపట్టారు.

protest for amaravathi
అమరావతి కోసం దళిత ఐకాస నేతల ధర్నా

అమరావతి రైతుల ఉద్యమం 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి దళిత ఐకాస నేతలు తుళ్లూరు మండలంలోని శాఖవరం అంబేడ్కర్ స్మృతి వనం వద్ద దీక్ష చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి దళిత ఐకాస నేతలు పాలాభిషేకం నిర్వహించారు. సీఎం జగన్ అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

అంతకుముందు స్మృతి వనం వద్దకు వెళ్తున్న ఐకాస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఎలాంటి ధర్నాలు చేసేందుకు అనుమతులు లేవని పోలీసులు అడ్డు చెప్పారు. కేవలం పరిమిత సంఖ్యలో వెళ్లి పాలాభిషేకం చేసి వస్తామని నేతలు చెప్పడంతో పోలీసులు అంగీకరించారు.

ఇదీ చదవండి : కరోనా వేళ జీవితానికో లేఖ రాయకూడదా?

అమరావతి రైతుల ఉద్యమం 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి దళిత ఐకాస నేతలు తుళ్లూరు మండలంలోని శాఖవరం అంబేడ్కర్ స్మృతి వనం వద్ద దీక్ష చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి దళిత ఐకాస నేతలు పాలాభిషేకం నిర్వహించారు. సీఎం జగన్ అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

అంతకుముందు స్మృతి వనం వద్దకు వెళ్తున్న ఐకాస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఎలాంటి ధర్నాలు చేసేందుకు అనుమతులు లేవని పోలీసులు అడ్డు చెప్పారు. కేవలం పరిమిత సంఖ్యలో వెళ్లి పాలాభిషేకం చేసి వస్తామని నేతలు చెప్పడంతో పోలీసులు అంగీకరించారు.

ఇదీ చదవండి : కరోనా వేళ జీవితానికో లేఖ రాయకూడదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.