ETV Bharat / city

289వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన

author img

By

Published : Oct 1, 2020, 7:59 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పే వరకు వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని రైతులు తేల్చిచెప్పారు. అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళన ప్రస్తుతం 289వ రోజుకు చేరుకుంది.

amaravati farmers protest
అమరావతి ప్రాంతంలో రైతులు నిరసన

అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం 289వ రోజుకు చేరుకుంది. తుళ్లారు, వెలగపూడి, మందడం, ఐనవోలు, లింగాయపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, బోరుపాలెం, నెక్కల్లు, నేలపాడు, గ్రామాల్లో రైతులు ఆందోళను కొనసాగించారు. నెక్కల్లులో గురువారం నుంచి దీక్షను ప్రారంభించారు. ప్రజాగాయకులు రమణ... చిన్నారులతో కలసి ఉద్యమ గీతాలు పాడారు.

మందడంలో సాయి కీర్తన చేస్తూ అక్కడి రైతులు నిరసన తెలిపారు. లింగాయపాలెంలో హనుమాన్ చాలీసా చదువుతూ ప్రార్థనలు చేశారు. కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతులకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చెందిన తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. రైతులకు ఉద్యమానికి సంఘీభావంగా తమ ప్రాంతంలోనూ ఐకాస ఏర్పాటు చేశామని నేతలు చెప్పారు.

అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం 289వ రోజుకు చేరుకుంది. తుళ్లారు, వెలగపూడి, మందడం, ఐనవోలు, లింగాయపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, బోరుపాలెం, నెక్కల్లు, నేలపాడు, గ్రామాల్లో రైతులు ఆందోళను కొనసాగించారు. నెక్కల్లులో గురువారం నుంచి దీక్షను ప్రారంభించారు. ప్రజాగాయకులు రమణ... చిన్నారులతో కలసి ఉద్యమ గీతాలు పాడారు.

మందడంలో సాయి కీర్తన చేస్తూ అక్కడి రైతులు నిరసన తెలిపారు. లింగాయపాలెంలో హనుమాన్ చాలీసా చదువుతూ ప్రార్థనలు చేశారు. కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతులకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చెందిన తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. రైతులకు ఉద్యమానికి సంఘీభావంగా తమ ప్రాంతంలోనూ ఐకాస ఏర్పాటు చేశామని నేతలు చెప్పారు.

ఇదీ చదవండి:

'మేం రాజధానికి భూములిచ్చాం.. ఇళ్ల స్థలాలకు కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.