ETV Bharat / briefs

వైకాపా తొలి హామీ... వైఎస్సార్ పింఛన్​ జీవో జారీ - వైఎస్సార్ పింఛను జారీ

నూతన పింఛన్​ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ ఉన్న ఎన్టీఆర్ భరోసా పేరు మారుస్తూ...వైఎస్సార్ పింఛన్​ కానుక అనే కొత్త పేరుతో పథకాన్ని ప్రకటించింది. వృద్ధాప్య పించన్​ పెంపుపై తొలిసంతకం చేసిన సీఎం జగన్...వాటి అమలును ప్రారంభించారు. రేపటినుంచి ఈ పింఛను పథకం అమల్లోకి రానుంది. వీటిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది.

నవరత్నాల్లో తొలి హామీ...వైఎస్సార్ పింఛను కానుక జీవో జారీ
author img

By

Published : May 31, 2019, 1:40 PM IST

Updated : May 31, 2019, 1:50 PM IST

వైకాపా తొలి హామీ... వైఎస్సార్ పింఛన్​ జీవో జారీ

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్​మోహన్​రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించిన విధంగానే వైఎస్సార్ పింఛన్​ కానుక పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ భరోసా పేరును వైఎస్సార్ పింఛను కానుకగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్​ రూ. 2250లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నూతన పింఛను పథకం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త పింఛను పథకం ప్రకారం వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు అందించనున్నారు. వృద్ధాప్య పింఛను అర్హుల వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. నవరత్నాల్లో ఒకటైన పింఛను పెంపుపై తొలి అడుగు పడింది.

ఇవీ చూడండి : ఉన్నతాధికారుల బదిలీలు..సీఎంగా తొలి రోజే జగన్ 'ముద్ర'

వైకాపా తొలి హామీ... వైఎస్సార్ పింఛన్​ జీవో జారీ

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్​మోహన్​రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించిన విధంగానే వైఎస్సార్ పింఛన్​ కానుక పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ భరోసా పేరును వైఎస్సార్ పింఛను కానుకగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్​ రూ. 2250లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నూతన పింఛను పథకం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త పింఛను పథకం ప్రకారం వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు అందించనున్నారు. వృద్ధాప్య పింఛను అర్హుల వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. నవరత్నాల్లో ఒకటైన పింఛను పెంపుపై తొలి అడుగు పడింది.

ఇవీ చూడండి : ఉన్నతాధికారుల బదిలీలు..సీఎంగా తొలి రోజే జగన్ 'ముద్ర'

Intro:కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది ni ఓ సైకో వేధింపులకు గురి చేస్తున్నాడు.


Body:రకరకాల ఫోన్ నెంబర్లతో ప్రాజెక్టు పరిధిలో పని చేస్తున్న సుమారు 20 మంది సిబ్బంది వినియోగిస్తున్న ప్రభుత్వ సెల్ఫోన్కు ఆ సైకో ఫోనులో వేధింపులకు గురిచేస్తున్నాడు.


Conclusion:ఇష్టం వచ్చిన సమయంలో లో రాత్రి పగలనక ఫోన్ చేయటం తీవ్ర అసభ్యపదజాలంతో మాట్లాడటమే కాక తన పేరు రాజు తన తల్లి సుజాత అంగన్వాడీ కార్యకర్త గా పనిచేస్తుందని ఆమెతో తాను రోజులు గడుపుతున్నా అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అంతేగాక వీడియో కాల్ చేస్తూ తన ముఖం చూపించవా చూపించకూడని అవయవాలను చూపుతూ తీవ్ర వేధింపులకు గురిచేశాడు ఈ విషయాన్ని సంబంధిత సిబ్బంది తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులతో రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది .ఏదేమైనా సైకో కంకిపాడు ప్రాజెక్టు పరిధిలో వారితోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నా డా లేక జిల్లా రాష్ట్రవ్యాప్తంగా మరి ఎవరితోనైనా ఇదేవిధంగా గా ప్రవర్తించడం అనే విషయంపై తేలాల్సి ఉంది. ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ కు ఎవరు ఫోన్ చేసినా సైకో నే ఫోన్ చేశాడని ఆందోళనకు గురవుతున్నారు.
Last Updated : May 31, 2019, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.