విశాఖ జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ కలెక్టరేట్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు...గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొనారు. ఎమ్మెల్యేలు బుడి ముత్యాల నాయుడు, గోళ్లబాబు రావు, కన్నబాబు, అదీప్ రాజ్, ఉమ శంకర్ గణేష్, గుడివాడ అమర్నాథ్లు సమావేశానికి హాజరయ్యారు. ఐసీడీఎస్, ఆర్.ఎ.సి.ఎస్, సర్వశిక్ష అభియాన్, గనులు, మధ్యాహ్న భోజన పథకాలలో అవకతవకలు జరుగుతున్నాయని వాటినిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖ నగరంలోని సిటీ సెంట్రల్ పార్క్, విమ్స్లకు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని తీర్మానించారు. మండలాలు వారీగా అభివృద్ధి, పెండింగ్ పనుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇదీ చదవండి : ''సొంత ప్రయోజనాల కోసమే పార్టీ వీడారు''