తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,296 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లుగా ఆలయ కమిటీ తెలిపింది.ఇవి కూడా చదవండి...
అంజలి జిమ్ వర్కవుట్ చూశారా?