ETV Bharat / briefs

మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి: చంద్రబాబు - ఏపీ సార్వత్రిక ఎన్నికలు 2019

కుటుంబానికి 2 లక్షల రూపాయల కనీస ఆదాయం వచ్చేలా చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎన్నికల సభకు హాజరైన సీఎం....ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు.

సీఎం చంద్రబాబు
author img

By

Published : Apr 5, 2019, 5:27 PM IST

కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని నియోజకవర్గాలు తెదేపాకు కంచుకోటగా పేర్కొన్న సీఎం...సైకిల్‌కు ఓటేసేందుకు మహిళలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఇకనుంచి ప్రతి ఏడాదీ పసుపు-కుంకుమ ఇస్తానన్న బాబు..పింఛన్లు, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ ఆపాలని వైకాపా నేతలు కోర్టుకు వెళ్లారని ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని తెలిపిన సీఎం...డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానని స్పష్టం చేశారు. సాగర్‌, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రిపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డిన బాబు..జగన్‌, కేసీఆర్, మోదీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

సీఎం చంద్రబాబు

ఏమరపాటుగా ఉంటే రాయలసీమ ఎడారిగా మారుతుందని హెచ్చరించిన చంద్రబాబు...మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారు. లింగాయత్‌లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆలూరులో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం...ఆలూరులో గుంటూరు తరహా మిర్చియార్డు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి : పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా -వైకాపా గొడవ.. లాఠీచార్జీ

కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని నియోజకవర్గాలు తెదేపాకు కంచుకోటగా పేర్కొన్న సీఎం...సైకిల్‌కు ఓటేసేందుకు మహిళలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఇకనుంచి ప్రతి ఏడాదీ పసుపు-కుంకుమ ఇస్తానన్న బాబు..పింఛన్లు, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ ఆపాలని వైకాపా నేతలు కోర్టుకు వెళ్లారని ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని తెలిపిన సీఎం...డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానని స్పష్టం చేశారు. సాగర్‌, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రిపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డిన బాబు..జగన్‌, కేసీఆర్, మోదీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

సీఎం చంద్రబాబు

ఏమరపాటుగా ఉంటే రాయలసీమ ఎడారిగా మారుతుందని హెచ్చరించిన చంద్రబాబు...మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారు. లింగాయత్‌లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆలూరులో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం...ఆలూరులో గుంటూరు తరహా మిర్చియార్డు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి : పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా -వైకాపా గొడవ.. లాఠీచార్జీ

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 08 4 3 9

AP_CDP_26_05_POST_VUDYAMAM_C3


Body:ఓటు పవిత్రమైనది . రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇదే అందరి ముందున్న ఏకైక లక్ష్యం. 100% పోలింగ్ లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలకు కడప జిల్లా మైదుకూరులోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు తోడయ్యారు ఈనెల 11న నిర్వహించబోయే పోలిక రోజున ఓటు హక్కు వినియోగించుకోవాలని తల్లిదండ్రులను కోరుతూ బాలికలు లేఖలు రాశారు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటూ లేఖలో పేర్కొన్నారు. ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.