ఉత్తర్ప్రదేశ్ హాపుడ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. మార్నింగ్ వాక్కు వెళ్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటన సింభావలి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవలి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
![firing on walkers in up today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16534152_978_16534152_1664701037839.png)
దేవలి గ్రామానికి చెందిన సుజిత్ తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం 6:15 గంటలకు మార్నింగ్ వాక్కు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లగానే మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సుజిత్ సహా ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
![firing on walkers in up today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16534152_943_16534152_1664701154203.png)
ఇవీ చదవండి: ఎలుక అనుకొని అండర్వేర్ మింగిన పాము.. మింగలేక, కక్కలేక అవస్తలు
సాయం చేసేవారిపై మృత్యువు పంజా.. ఆటో డ్రైవర్ను రక్షిస్తూ ఇద్దరు దుర్మరణం