గ్రామానికి రోడ్డు వచ్చేంతవరకు పెళ్లి చేసుకోనని ప్రధానికి లేఖ (Letter to PMO india) రాసిన కర్ణాటక యువతి ఆశయం నెరవేరింది. ఆ ఊరికి రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఓ బస్సు కూడా ఆ గ్రామానికి వచ్చింది. (Rampur village road no marriage)
దావనగెరె జిల్లా రాంపుర్ గ్రామానికి చెందిన బిందు(26).. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. తన గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామానికి రోడ్డు వేసేంత వరకు తాను వివాహం చేసుకోనని చెప్పారు. (Rampur village road no marriage) స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా తమ గ్రామానికి కనీస సదుపాయాలు అందుబాటులోకి రాలేదని 'ఈటీవీ భారత్'తో యువతి వాపోయారు. అందుకే సీఎం, పీఎంకు లేఖ రాసినట్లు చెప్పారు.
కదిలిన సర్కారు
ఈ విషయంపై 'ఈటీవీ భారత్' అందించిన కథనానికి అధికార యంత్రాంగం నుంచి స్పందన వచ్చింది. దావనగెరె జిల్లా కలెక్టర్ మహంతేశ్ బిలాగి.. గ్రామాన్ని సందర్శించి, రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. యువతి సమస్యపై సీఎం కార్యాలయం స్పందించి.. తగిన చర్యలకు ఆదేశించింది. (Rampur village road no marriage)
బస్సుకు పూజలు
దీంతో వెంటనే జిల్లా యంత్రాంగం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. సిమెంట్ రోడ్డును పూర్తి చేసింది. రోడ్డు నిర్మాణం పూర్తైన నేపథ్యంలో ఆర్టీసీ బస్సు గ్రామంలోకి వచ్చింది. ఈ సందర్భంగా బస్సుకు యువతి గ్రామస్థులు పూజలు చేశారు.
ఇదీ చదవండి: పోలీసులు అరెస్టు చేస్తారని తుపాకీతో కాల్చుకున్న నిందితుడు