దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ముంబయితో పాటు ఠాణే, పాల్ఘర్లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు చోట్ల పట్టాలపైకి నీళ్లు చేరి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
![Mumbai rains: Five teams of NDRF on standby,says Maha minister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8907087_10.jpg)
![Mumbai rains: Five teams of NDRF on standby,says Maha minister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8907087_6.jpg)
సహాయక చర్యల నిమిత్తం.. అదనంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను(ఎన్డీఆర్ఎఫ్) సిద్ధంగా ఉంచినట్లు స్పష్టం చేశారు మంత్రి విజయ్ వాడేట్టీవార్. ప్రజల్ని ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించారు.
![Mumbai rains: Five teams of NDRF on standby,says Maha minister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8907087_8.jpg)
బంగాల్కు భారీ వర్షసూచన..
బంగాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. డార్జిలింగ్, కాలింపోడ్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నట్లు తెలిపింది. నదులు ఉద్ధృతంగా ప్రవహించవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
![Mumbai rains: Five teams of NDRF on standby,says Maha minister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8907087_4.png)
ఇప్పటికే కుమార్గ్రామ్, దామోహినీ ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం కురిసిందని ప్రాంతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ జీకే దాస్ తెలిపారు. కోల్కతాలో 2 రోజులు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
యూపీలోనూ..
ఉత్తర్ప్రదేశ్లోనూ మంగళవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్రకూట్లోని కర్వీలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
![Mumbai rains: Five teams of NDRF on standby,says Maha minister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8907087_0.jpg)
గురువారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు.. పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించారు అధికారులు.
సిక్కిం ప్రధాన రహదారిపై..
భారీ వర్షాల కారణంగా బంగాల్ నుంచి సిక్కిం వెళ్లే పదో నెంబర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాకాలంలో.. ఈ రోడ్డుపై ప్రయాణాలు చేయడం చాలా ప్రమాదమని స్థానికులు అంటున్నారు.
![Mumbai rains: Five teams of NDRF on standby,says Maha minister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8907087_1.jpg)