భారత సరిహద్దుల్లో మూడు హెలిప్యాడ్లను నేపాల్ ప్రభుత్వం నిర్మిస్తోంది. గండక్ నది నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
![nepal helipad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-vlk-01-helipad-photo-bhc10121_06082020074755_0608f_1596680275_796.jpg)
వీటిలో రెండు హెలిప్యాడ్లను వరుసగా బిహార్ రాష్ట్రం వాల్మీకి నగర్లోని నరసాహి, త్రివేణిల్లో నిర్మిస్తున్నారు. మరో హెలిప్యాడ్ను ఉత్తర్ప్రదేశ్లోని మహారాజ్ గంజ్ జిల్లా సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిన్ వద్ద నిర్మిస్తున్నారు.
![nepal helipad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-vlk-01-helipad-photo-bhc10121_06082020074755_0608f_1596680275_1094.jpg)
నేపాల్ చర్యలను తీవ్రంగా పరిగణించిన సశస్త్ర సీమాబల్ అధికారులు సరిహద్దుల్లో గస్తీ ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్ని రోజులుగా భారత్పై నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది నేపాల్. కాలపానీ సమస్యతో సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది.
![nepal helipad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-vlk-01-helipad-photo-bhc10121_06082020074755_0608f_1596680275_47.jpg)
ఇదీ చూడండి: భారత్-చైనా చర్చల పురోగతికి అడ్డుగా పాంగాంగ్!