ETV Bharat / bharat

ఉద్రిక్తతల వేళ సైన్యాధిపతి లద్దాఖ్​ పర్యటన

author img

By

Published : Jun 23, 2020, 10:34 AM IST

Updated : Jun 23, 2020, 1:22 PM IST

భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి​ నరవాణే లద్ధాఖ్​కు పయనమయ్యారు. అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు.

Army Chief
లద్దాఖ్​కు ఆర్మీ చీఫ్

భారత ఆర్మీ చీఫ్​ జనరల్‌ ఎమ్​ఎమ్​ నరవాణే ఇవాళ లద్ధాఖ్‌ వెళ్లారు. వాస్తవాధీనరేఖ వెంబడి క్షేత్రస్థాయి పరిస్థితులపై సైనికాధికారులతో బుధవారం చర్చలు జరపనున్నారు. ఈ మేరకు సైనికవర్గాలు తెలిపాయి.

నరవాణే రెండు రోజుల పాటు లద్ధాఖ్​లో పర్యటిస్తారు. గల్వాన్​ లోయ వద్ద ఘర్షణలు మొదలైన తర్వాత సైన్యాధిపతి లద్దాఖ్​కు వెళ్లడం ఇదే మొదటిసారి. చైనా సైన్యాన్ని తరిమికొట్టేందుకు సైనికచర్యను భారత్‌ పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో జనరల్‌ నరవాణే లద్దాఖ్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

  • #WATCH Delhi: Army Chief General Manoj Mukund Naravane leaves for Ladakh. He will review the on-ground situation there with the 14 Corps officials and the progress in talks with the Chinese military. pic.twitter.com/DKvuXzrVLw

    — ANI (@ANI) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాయుసేన గస్తీ...

అయితే లేహ్​లో భారత వాయుసేన యుద్ధవిమానాలు గస్తీ కాస్తున్నాయి. గల్వాన్​ ఘటన అనంతరం వాయుసేన.. సరిహద్దు పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తోంది.

భారత ఆర్మీ చీఫ్​ జనరల్‌ ఎమ్​ఎమ్​ నరవాణే ఇవాళ లద్ధాఖ్‌ వెళ్లారు. వాస్తవాధీనరేఖ వెంబడి క్షేత్రస్థాయి పరిస్థితులపై సైనికాధికారులతో బుధవారం చర్చలు జరపనున్నారు. ఈ మేరకు సైనికవర్గాలు తెలిపాయి.

నరవాణే రెండు రోజుల పాటు లద్ధాఖ్​లో పర్యటిస్తారు. గల్వాన్​ లోయ వద్ద ఘర్షణలు మొదలైన తర్వాత సైన్యాధిపతి లద్దాఖ్​కు వెళ్లడం ఇదే మొదటిసారి. చైనా సైన్యాన్ని తరిమికొట్టేందుకు సైనికచర్యను భారత్‌ పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో జనరల్‌ నరవాణే లద్దాఖ్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

  • #WATCH Delhi: Army Chief General Manoj Mukund Naravane leaves for Ladakh. He will review the on-ground situation there with the 14 Corps officials and the progress in talks with the Chinese military. pic.twitter.com/DKvuXzrVLw

    — ANI (@ANI) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాయుసేన గస్తీ...

అయితే లేహ్​లో భారత వాయుసేన యుద్ధవిమానాలు గస్తీ కాస్తున్నాయి. గల్వాన్​ ఘటన అనంతరం వాయుసేన.. సరిహద్దు పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తోంది.

Last Updated : Jun 23, 2020, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.