Villegers Set to The Fire On a Women : మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తుందన్న నెపంతో కొంతమంది గ్రామస్థులు ఓ మహిళను తీవ్రంగా కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు, ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
పోలీసులు మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.