Two Dead Bodies Found in Godavari River At Basara : నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది రెండో ఘాట్ వేద భారతి పీఠం వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.
వారంలో ఇద్దరు మహిళల మృతదేహాలు బయటపడిన ఘటన మరువక ముందే, మరో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇద్దరి మృతదేహాల్లో ఒకరు వృద్ధుడు కాగా, మరొకరు యువకుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.