Governor Jishnu Dev Release RS.30 Lakhs For Flood Victims : తెలంగాణ వరద బాధితుల సహాయక చర్యల కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 30 లక్షల రూపాయలను విడుదల చేశారు. తన విచక్షణ నిధుల్లోంచి 30 లక్షల రూపాయలను చెక్ను గవర్నర్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు. తక్షణ వరద సాయం చేయాలని సొసైటీని కోరారు. రెడ్ క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్జీవోలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.
బాధితులకు కావాల్సిన ఆహారం, మందులు ఇతర అత్యవసర వస్తువులను పంపిణీ చేయాలని కోరారు. వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని గవర్నర్ ఆదేశించారు. వరదల్లో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.