IPS Officers Transfers in Telangana : రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి 8 మంది అధికారులకు స్థానచలనం కలిగించింది. కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్ను నియమించగా, ములుగు ఓఎస్డీగా గీతే మహేశ్ బాబాసాహెబ్ నియామకమయ్యారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్ వ్యవహరించనుండగా, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్ను నియమించింది.
వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.