TG Govt Appoint Sub Committee for ORR : అవుటర్ రింగు రోడ్డు పరిధి లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనంపై, రాష్ట్రప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘానికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఛైర్మన్గా, పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహా సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై గతంలో చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం పూర్తిస్థాయి అధ్యయనం కోసం ఈ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఓఆర్ఆర్ వరకు ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులు, నిపుణులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. ఓఆర్ఆర్ వరకు స్థానిక సంస్థల పునర్ వ్యవస్థీకరణపై సిఫార్సులు చేయనుంది.