ETV Bharat / snippets

రామోజీ ఇచ్చిన స్పూర్తితోనే ఈనాడు ఉద్యోగి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగాను- ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 5:41 PM IST

TDP_MP_Kalisetti_on_Ramoji_Rao
TDP_MP_Kalisetti_on_Ramoji_Rao (ETV Bharat)

TDP MP Kalisetti on Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఇక లేరనే వార్త తనకు ఎంతగానో బాధ కలిగించిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఈనాడులో గ్రామీణ ప్రాంతం నుంచి రిపోర్టర్​గా పనిచేసిన తనకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి అవార్డును ఛైర్మన్ ప్రకటించారని, ఈనాడు గ్రూప్ సంస్థల ఎండి కిరణ్ చేతుల మీదుగా ఇదే అవార్డును అందుకోవడం ఎంతో అనుభూతి కలిగించిందన్నారు. ఇలా తనను రామోజీరావు ఎంతగానో ప్రోత్సహించారని అప్పలనాయుడు గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన స్వయంగా హైదరాబాద్ పిలిపించుకుని, ఆయన స్వహస్తాలతో మనస్ఫూర్తిగా తనను దీవించిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయని అప్పలనాయుడు అన్నారు. ఒకప్పుడు ఈనాడు సంస్థ ఉద్యోగిగా పనిచేసిన తాను, ప్రస్తుతం విజయనగరం ఎంపీ స్థాయికి ఎదిగేందుకు రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తే కారణమని అన్నారు.

TDP MP Kalisetti on Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఇక లేరనే వార్త తనకు ఎంతగానో బాధ కలిగించిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఈనాడులో గ్రామీణ ప్రాంతం నుంచి రిపోర్టర్​గా పనిచేసిన తనకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి అవార్డును ఛైర్మన్ ప్రకటించారని, ఈనాడు గ్రూప్ సంస్థల ఎండి కిరణ్ చేతుల మీదుగా ఇదే అవార్డును అందుకోవడం ఎంతో అనుభూతి కలిగించిందన్నారు. ఇలా తనను రామోజీరావు ఎంతగానో ప్రోత్సహించారని అప్పలనాయుడు గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన స్వయంగా హైదరాబాద్ పిలిపించుకుని, ఆయన స్వహస్తాలతో మనస్ఫూర్తిగా తనను దీవించిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయని అప్పలనాయుడు అన్నారు. ఒకప్పుడు ఈనాడు సంస్థ ఉద్యోగిగా పనిచేసిన తాను, ప్రస్తుతం విజయనగరం ఎంపీ స్థాయికి ఎదిగేందుకు రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తే కారణమని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.