ETV Bharat / snippets

అప్పులు చేస్తున్నావని మందలించడమే పాపం- మద్యం మత్తులో తండ్రిని హతమార్చిన కుమారుడు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 7:58 PM IST

Son killed his Father in Drunkenness at Anantapur District
Son killed his Father in Drunkenness at Anantapur District (ETV Bharat)

Son killed his Father in Drunkenness at Anantapur District : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కుమారుడ్ని మందలించినందుకు తండ్రినే హతమార్చాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన బెలుగుప్ప మండలం యలగలవంక తాడంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, రోజు మద్యం తాగి ఇంటికి వస్తున్న కుమారుడు రాజశేఖర్ నాయక్​ను ఎందుకు అప్పులు చేస్తున్నావని తండ్రి తిప్పేస్వామి నాయక్ (53) మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కుమారుడు తండ్రి మెడమీద తొక్కి నులమడంతో తిప్పేస్వామి నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గొడవను ఆపాల్సిన భార్య లక్ష్మీబాయి సైతం కుమారుడికి సహకరించింది. మృతుడి కుమార్తె జ్యోతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Son killed his Father in Drunkenness at Anantapur District : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కుమారుడ్ని మందలించినందుకు తండ్రినే హతమార్చాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన బెలుగుప్ప మండలం యలగలవంక తాడంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, రోజు మద్యం తాగి ఇంటికి వస్తున్న కుమారుడు రాజశేఖర్ నాయక్​ను ఎందుకు అప్పులు చేస్తున్నావని తండ్రి తిప్పేస్వామి నాయక్ (53) మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కుమారుడు తండ్రి మెడమీద తొక్కి నులమడంతో తిప్పేస్వామి నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గొడవను ఆపాల్సిన భార్య లక్ష్మీబాయి సైతం కుమారుడికి సహకరించింది. మృతుడి కుమార్తె జ్యోతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.