ETV Bharat / snippets

నంద్యాల జిల్లాలో పండుగపూట విషాదం - రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడి మృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 12:37 PM IST

Allagadda Road Accident Today
Allagadda Road Accident Today (ETV Bharat)

Allagadda Road Accident Today : నంద్యాల జిల్లాలో పండుగ పూట విషాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పేరయ్యపల్లెమెట్ట వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొనడంతో తల్లీకుమారుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లెకు చెందిన కాంతమ్మ(40), ఆమె కుమారుడు జగదీశ్వర్ రెడ్డి (17), మరో వ్యక్తి వెంకటరమణతో కలిసి హైదరాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు, ఈ క్రమంలోనే పేరాయిపల్లి మెట్ట వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాంతమ్మ, జగదీశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

Allagadda Road Accident Today : నంద్యాల జిల్లాలో పండుగ పూట విషాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పేరయ్యపల్లెమెట్ట వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొనడంతో తల్లీకుమారుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లెకు చెందిన కాంతమ్మ(40), ఆమె కుమారుడు జగదీశ్వర్ రెడ్డి (17), మరో వ్యక్తి వెంకటరమణతో కలిసి హైదరాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు, ఈ క్రమంలోనే పేరాయిపల్లి మెట్ట వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాంతమ్మ, జగదీశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.