Ravipati Kondalrao Meet Central Minister RamMohan Naidu: ప్రకాశం జిల్లా దొనకొండలోని విమానాశ్రయం వినియోగంలోకి తీసుకురావాలని భారతీ రంగ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి రావిపాటి కొండలరావు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని మంత్రి నివాసంలో రావిపాటి రామ్మోహన్ను కలిశారు. విమానాశ్రయం కోసం 134 ఎకరాలు స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. 60 సంవత్సరాలుగా స్థలం, భవనం నిరుపయోగంగా ఉన్నాయని మంత్రికి వివరించారు. ప్రస్తుతం విమానాశ్రయం నడపడానికి 600 ఎకరాలు అవసరమవుతుందని కేంద్రమంత్రి చెప్పారు. విమానాశ్రయం సాధ్యం కానీ పక్షంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడతానని ఆయన హామీ ఇచ్చారు. తక్షణమే స్థలాన్ని పరిశీలించాలని అధికారులకు కేంద్రమంత్రి సూచించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసిన రావిపాటి కొండలరావు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 8:50 PM IST
Ravipati Kondalrao Meet Central Minister RamMohan Naidu: ప్రకాశం జిల్లా దొనకొండలోని విమానాశ్రయం వినియోగంలోకి తీసుకురావాలని భారతీ రంగ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి రావిపాటి కొండలరావు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని మంత్రి నివాసంలో రావిపాటి రామ్మోహన్ను కలిశారు. విమానాశ్రయం కోసం 134 ఎకరాలు స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. 60 సంవత్సరాలుగా స్థలం, భవనం నిరుపయోగంగా ఉన్నాయని మంత్రికి వివరించారు. ప్రస్తుతం విమానాశ్రయం నడపడానికి 600 ఎకరాలు అవసరమవుతుందని కేంద్రమంత్రి చెప్పారు. విమానాశ్రయం సాధ్యం కానీ పక్షంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడతానని ఆయన హామీ ఇచ్చారు. తక్షణమే స్థలాన్ని పరిశీలించాలని అధికారులకు కేంద్రమంత్రి సూచించారు.