ETV Bharat / snippets

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పబ్బులపై దాడులు - పలువురికి డ్రగ్స్​ పాజిటివ్

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 10:52 AM IST

OFFICIALS RAID ON PUBS AND BARS
Raid on Pubs in Hyderabad and Rangareddy (ETV Bharat)

Raid on Pubs in Hyderabad and Rangareddy : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పబ్బులు, బార్లపై అధికారులు మరోసారి దాడులు చేశారు. శుక్రవారం రాత్రి నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేసి, 107 మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు కొనసాగిన తనిఖీల్లో ఆరుగురు మత్తు పదార్థాలు సేవించినట్లు పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు.

జీ 40 పబ్బులో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరాలో ఒకరికి, క్లబ్​ రోగ్​లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటిసారి నిర్వహించిన డ్రగ్ డిటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు.

Raid on Pubs in Hyderabad and Rangareddy : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పబ్బులు, బార్లపై అధికారులు మరోసారి దాడులు చేశారు. శుక్రవారం రాత్రి నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేసి, 107 మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు కొనసాగిన తనిఖీల్లో ఆరుగురు మత్తు పదార్థాలు సేవించినట్లు పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు.

జీ 40 పబ్బులో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరాలో ఒకరికి, క్లబ్​ రోగ్​లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటిసారి నిర్వహించిన డ్రగ్ డిటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.