ETV Bharat / snippets

గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు పేరిట భూమి కబ్జా చేశాడంటూ బాధితుల ధర్నా

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 5:25 PM IST

People Protest In Palla medical Colleges
People Protest In Neelima Medical College In Medchal (ETV Bharat)

People Protest In Neelima Medical College In Medchal : జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరో భూవివాదంలో ఇరుక్కున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్​లో పల్లాకు చెందిన నీలిమ మెడికల్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు పేరిట తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ కొందరు ఆందోళనలు చేపట్టి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాడికి నిరసనగా బాధితులు అక్కడే బైఠాయించారు. ఇంతలో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని శాంతింపజేశారు.

People Protest In Neelima Medical College In Medchal : జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరో భూవివాదంలో ఇరుక్కున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్​లో పల్లాకు చెందిన నీలిమ మెడికల్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు పేరిట తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ కొందరు ఆందోళనలు చేపట్టి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాడికి నిరసనగా బాధితులు అక్కడే బైఠాయించారు. ఇంతలో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని శాంతింపజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.