Minor Boy Rash Driving In Manikonda : రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారు బీభత్సవం సృష్టించింది. కారులో ఉన్న మైనర్ బాలుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ గోల్డెన్ టెంపుల్ వద్ద పార్కింగ్ చేసిన బైకర్లను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా 20 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవింగ్ చేసిన మైనర్ బాలుడిపై స్థానికులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైనర్ నడిపిన మారుతి బాలెనో వాహనం అతని తల్లి పేరు మీద ఉండటంతో ఆమెపై ఐపీసీ 279,337 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.