ETV Bharat / snippets

18 నెలల పసికందును అమ్మేసిన తండ్రి - 24 గంటల్లో తల్లిఒడికి చేర్చిన పోలీసులు - Man Sells Daughter in Old CIty

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 2:40 PM IST

Man Sells Daughter for 1 lakh in Old City
Man Sells Daughter for 1 lakh in Old City

Man Sells Daughter for 1 lakh in Old City : హైదరాబాద్ పాతబస్తీలో 18 రోజుల నవజాత శిశువును తండ్రి విక్రయించిన 24 గంటల్లోపే పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. పాతబస్తీకి చెందిన అసిఫ్‌ తన భార్య అస్మా బేగంను బెదిరించి తమ బిడ్డను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్‌కు లక్ష రూపాయలకు అమ్మాడు. ఈ విషయంలో చాంద్ సుల్తానా అనే మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. వెంటనే అస్మా తన పాప కావాలని బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే కర్ణాటక వెళ్లి పాపను తిరిగి తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. బాలిక తండ్రి, మధ్యవర్తిగా ఉన్న మహిళను, శిశువును విక్రయించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోపే ఆ పసికందును తల్లిఒడికి చేర్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

Man Sells Daughter for 1 lakh in Old City : హైదరాబాద్ పాతబస్తీలో 18 రోజుల నవజాత శిశువును తండ్రి విక్రయించిన 24 గంటల్లోపే పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. పాతబస్తీకి చెందిన అసిఫ్‌ తన భార్య అస్మా బేగంను బెదిరించి తమ బిడ్డను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్‌కు లక్ష రూపాయలకు అమ్మాడు. ఈ విషయంలో చాంద్ సుల్తానా అనే మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. వెంటనే అస్మా తన పాప కావాలని బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే కర్ణాటక వెళ్లి పాపను తిరిగి తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. బాలిక తండ్రి, మధ్యవర్తిగా ఉన్న మహిళను, శిశువును విక్రయించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోపే ఆ పసికందును తల్లిఒడికి చేర్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.