Former RTC Chairman Gone Prakashrao Comments on Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బంధువులే తనకు తెలియదంటూ సీబీఐ కోర్టులో అబద్దాలు చెప్పిన జగన్ దుర్మార్గుడని ఆయన విమర్శించారు.
జన్మభూమి లాంటి కార్యక్రమాలు సీఎం చంద్రబాబు చేపడితే విదేశీ విరాళాలు ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ఏపీలో 36 మంది హత్యకు గురయ్యారని చెబుతున్న జగన్ వాటి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి జగన్లా పరదాలు కట్టుకుని పర్యటించలేదని ఆయన విమర్శించారు. ప్రజల నుంచి పూర్తి మెజారిటీ వచ్చాక రాష్ట్రపతి పాలన ఎలా అనుమతిస్తారని ఆయన నిలదీశారు.