ETV Bharat / snippets

మందుబాబులపై పోలీసుల కొరడా - మత్తులో వాహనం నడిపిన 212మంది అరెస్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 9:58 AM IST

Drunk and Drive In Hyderabad
Drunk and Drive In Hyderabad (ETV Bharat)

వీకెండ్ వచ్చిందంటే చాలు ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తుంటారు. వారికోసమే సైబరాబాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. శుక్ర, శని వారాల్లో రాత్రి విస్తృతంగా తనిఖీలు చేసి మద్యం మత్తులో వాహనాలు నడిపిన 212 మందిని అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. పట్టుబడ్డవారిలో 165మంది ద్విచక్ర వాహనాదారులు కాగా 34మంది నాలుగు చక్ర వాహనాలు, ముగ్గురు భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు. పది మంది మైకంలో ఆటోలు నడుపుతూ ఆటోలను నడుపుతున్నారు. 21మంది స్పృహ లేనంతగా మత్తులో ఉండడం పోలీసులు గమనించి వారి బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సంట్రేష్రన్‌ 100 మిల్లీలీటర్ల రక్తం నమూనాలో 200 నుంచి 550 గ్రాములు ఆల్కహాల్‌ ఉన్నట్లు గుర్తించారు. భారత న్యాయ సంహిత సెక్షన్‌ 105 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని సీపీ చెప్పారు.

వీకెండ్ వచ్చిందంటే చాలు ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తుంటారు. వారికోసమే సైబరాబాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. శుక్ర, శని వారాల్లో రాత్రి విస్తృతంగా తనిఖీలు చేసి మద్యం మత్తులో వాహనాలు నడిపిన 212 మందిని అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. పట్టుబడ్డవారిలో 165మంది ద్విచక్ర వాహనాదారులు కాగా 34మంది నాలుగు చక్ర వాహనాలు, ముగ్గురు భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు. పది మంది మైకంలో ఆటోలు నడుపుతూ ఆటోలను నడుపుతున్నారు. 21మంది స్పృహ లేనంతగా మత్తులో ఉండడం పోలీసులు గమనించి వారి బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సంట్రేష్రన్‌ 100 మిల్లీలీటర్ల రక్తం నమూనాలో 200 నుంచి 550 గ్రాములు ఆల్కహాల్‌ ఉన్నట్లు గుర్తించారు. భారత న్యాయ సంహిత సెక్షన్‌ 105 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని సీపీ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.